పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా  తెరకెక్కిన టెంపర్ సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఈ సినిమాని తమిళంలో అయోగ్యగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే ఏవో ఆర్ధిక కారణాల వలన సినిమా రిలీజ్ గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తుంది. ఇందులో ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలో ఒకప్పటి తమిళ హీరో పార్తివన్ నటిస్తున్నాడు.

 

ఈ సినిమా ఇప్పటికే బాలీవుడ్ లో రణవీర్ సింగ్ సింబ క్రింద రీమేక్ చేసి అక్కడ కూడా హిట్ కొట్టాడు. అక్కడ ఏకంగా 250 కోట్ల వరకు కలెక్షన్ ని ఈ సినిమా రాబట్టింది. మరో వైపు ఇప్పటికి టెంపర్ సినిమా టెలివిజన్ లలో ఎప్పుడు వచ్చిన విపరీతంగా జనాలు చూస్తూ ఉంటారు. టెంపర్ లో ఎన్టీఆర్ నెగిటివ్ పాత్రలో అద్బుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు ఇక సినిమాలో క్లైమాక్స్  వచ్చే సన్నివేశాలు అందరికి నచ్చుతాయి.


ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా తన సినిమా కాపీ అంటూ అయోగ్య సినిమాలో విలన్ గా నటించిన పార్తివన్ తెరముందుకి వచ్చాడు. తమిళంలో పలు సినిమాలో హీరోగా నటించిన పార్తిపన్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు.  టెంపర్ మూవీ తన సినిమా ఉల్లే వేలియే సినిమా కాపీ అని ఇప్పుడు ఆసక్తికర వాఖ్యలు చేసాడు. అయితే అతని వాఖ్యలపై తమిళ హీరో విశాల్ అయితే స్పందించలేదు. మరి  దర్శకుడు పూరీ జగన్నాథ్, రచయిత వక్కంత వంశీ ఇప్పుడు ఎలా స్పందిస్తాడు అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: