బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అందుకే ప్రభాస్ తన కొత్త సినిమాలను ఆ రేంజ్లోనే రూపొందిస్తున్నారు. ప్రస్తుతం సాహో షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రభాస్.. హిందీ ప్రేక్షకులకు సొంత గొంతుతో షాక్ ఇవ్వబోతున్నాడట.
బాహుబలిలో డబ్బింగ్ గొంతుతోనే ప్రభాస్ హిందీ ప్రేక్షకులకు వినిపించాడు. కానీ సాహో లో మాత్రం తానే డబ్బింగ్ చెప్పుకోవాలనుకుంటున్నారట. ప్రభాస్ కు హిందీ కూడా బాగానే వస్తుంది. కాకపోతే అందులో సౌత్ యాస ఉంటుంది. ఈ లోపం అధిగమించేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడట ప్రభాస్.
ఐతే.. ఈ విషయంలో తానే నిర్ణయం తీసుకుంటాడట. ట్రైనింగ్ తర్వాత తనకు సంతప్తిగా అనిపిస్తేనే సొంత గొంతుతో డైలాగ్స్ చెబుతాడట. అంతగా పర్ ఫెక్షన్ లేకపోతే మాత్రం ఇతరులతోనే డబ్బింగ్ చెప్పిస్తాడట. తన సరదాతో సినిమా ఇబ్బందుల్లో పడకూడదన్నదే ప్రభాస్ ఆలోచన.
సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ కథానాయిక. సంగీతం శంకర్ - ఎహసాన్- లాయ్. సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రాన్ని స్వాతంత్ర్య దినోత్సవం రోజు విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా ప్రభాస్ హీరోయిజం కంటిన్యూ అవుతుందా లేదా తేలుస్తుంది.