ఆర్ ఎక్స్ 100 ద‌ర్శ‌కుడితో మాస్‌మ‌హారాజా ర‌వితేజ సినిమా చేయ‌నున్నారు. 'ఆర్ ఎక్స్ 100స చిత్రం కుర్రకారు మనసులను బాగా పట్టేసింది. దర్శకుడు అజయ్ భూపతికి యూత్‌లో ఈ సినిమా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో అజయ్ భూపతి తదుపరి సినిమా పేరుగా 'మహాసముద్రం' వినిపించింది. చైతూ కథానాయకుడిగా ఈ సినిమా రూపొందనున్నట్టు వార్తలు వచ్చాయి.
 చైతూ మార్కెట్ కి మించి బడ్జెట్ వున్న కారణంగా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడం లేదనేది తాజా సమాచారం. దాంతో తనతో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతోన్న రవితేజ కోసం అజయ్ భూపతి మంచి మాస్ మసాలా కథని సిద్ధం చేస్తున్నార‌ని అంటున్నారు. గ‌త కొంత కాలంగా హిట్ అనే మాటకు దూరంగా వుండిపోయిన రవితేజ, అజయ్ భూపతి టాలెంట్ ను గుర్తించి అవకాశమిచ్చార‌ని చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి మరి. 
'ఆర్ ఎక్స్ 100 చిత్రంతో మంచి క్రేజ్‌ను సంపాదించిన అజ‌య్‌భూప‌తి, మాస్ మ‌హారాజా ర‌వితేజ ఒక‌ర‌కంగా చెప్పాలంటే సూప‌ర్ కాంబినేష‌న్ అనే చెప్పాలి.  హిట్ సినిమాకి చాలా గ్యాప్ వ‌చ్చిన ర‌వితేజ‌కి  హిట్ రావాల‌ని కోరుకుంటున్నారు సినీ ప్రేక్ష‌కులు.


మరింత సమాచారం తెలుసుకోండి: