ఇటీవ‌లె విడుద‌లైన మ‌హ‌ర్షి చిత్రం వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. వంశీపైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు, పూజాహెగ్డే జంట‌గా న‌టించారు. ఈ నెల 9న విడుద‌లైన ఈ చిత్రం బాక్సీఫీస్ ముందు వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాలో మూడు గెటప్‌ల్లోనూ మహేశ్ అభిమానులను అమితంగా ఆకట్టుకున్నారు.
ఒక పెద్ద బిజినెస్ మ్యాన్‌గా చాలా మ్యాన్‌లీగా క‌నిపిస్తే యూత్‌ని ఆక‌ట్టుకునే విధంగా కాలేజ్ స్టూడెంట్‌గా  ప్ర‌స్తుతం ట్రెండ్‌కి త‌గ్గ‌ట్టుగా చాలా బావున్నారు. ఇక రైతు పాత్ర‌కి వ‌స్తే ముఖ్యంగా అటు మాస్ ఇటు క్లాస్‌ని ఆక‌ట్టుకునే విధంగా ఉంది. ప్ర‌స్తుతం యూత్‌నుంచి ప్ర‌తిఒక్క‌రికీ ఈ చిత్రం ఓ మెసేజ్‌లా ప‌నిచేసింది. సినిమా చూసిన వారంతా వీకెండ్ వ్యవసాయం చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. 
ఒకరకంగా ఇది సినిమా పబ్లిసిటీకి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అల్లరి నరేష్‌కు మంచి టర్నింగ్ పాయింట్ అనేచెప్పాలి. హీరో, విల‌న్ పాత్ర‌లేకాక క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా కూడా మంచి పాత్రలో చేశారు. తక్కువ సమయంలో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడంతో ‘మహర్షి’ చిత్రబృందం ఆనందంలో మునిగి తేలుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: