పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 2010 లో వచ్చిన 'పులి' సినిమాతో హీరోయిన్‌గా వెండి తెరకు పరిచయమైంది నికిషా పటేల్. ఈ సినిమా అనుకున్నంత సక్సస్ కాకపోయినప్పటికి తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళంతో కలిపి 30 సినిమాలవరకు చేసింది. అంతేకాదు బి.బి.సి టీవీ షోస్ లో కూడా బాగానే పార్టిసిపేట్ చేస్తుంది. ఇక కొంత గ్యాప్ తర్వాత వరుసబెట్టి సినిమాలను చేస్తున్న నికిషా రీసెంట్ గా మరో తమిళ సినిమాను చేస్తోంది.


ఇక చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ మెగా ఫోన్‌పట్టుకున్నాదర్శకుడు చరణ్‌. చాలా సంవత్సరాల క్రితం చరణ్‌ సిద్ధం చేసిన ‘వసూల్‌రాజా ఎంబీబీఎస్‌’ సీక్వెల్‌ కథతో ఇప్పుడు ‘మార్కెట్‌ రాజా ఎంబీబీఎస్‌’ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఆరవ్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఆరవ్‌తో తొలిసారిగా జతకడుతోంది నికిషా పటేల్‌. 


ఇక నికిషా పటేల్‌ ప్రస్తుతం జీవీ ప్రకాశ్‌తో కలిసి ఓ సినిమాలోనూ నటిస్తోంది. ఈ చిత్రానికి ఎళిల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయిందని సమాచారం. అంతేకాకుండా రీసెంట్ గా టి- సీరిస్‌ హిందీ ఆల్బంలోనూ నటించింది నికిషా. వీటితో పాటు మరో రెండు తమిళ చిత్రాల్లో కూడా నటిస్తున్నట్లు తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్‌డేట్.


మరింత సమాచారం తెలుసుకోండి: