యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ మాట తప్పడం అంటే అది మామూలే. ఎందుకంటే బాహుబలి తరువాత పెళ్ళి చేసుకుంటానని పెదనాన్న క్రిష్ణం-రాజుకు మాట ఇచ్చాడు. బాహుబలి 2 రిలీజ్ అయి కూడా రెండేళ్ళు దాటిపోయింది. ఇక పెళ్ళి వూసు ప్రభాస్ చెప్పడని ఫ్యాన్స్ కూడా డిసైడ్ అయిపోయారు. ఇపుడు ప్రభాస్ మరోసారి మాట తప్పుతున్నాడట.


సాహో మూవీని గత రెండేళ్ళుగా తీస్తున్న ప్రభాస్ ఆ మూవీని ఈ ఏడాది ఆగస్ట్ 15కి రిలీజ్ చేస్తానని చెప్పుకొచ్చాడు. యూనిట్ కూడా ఆ విధంగానే ప్రకటన ఇచ్చింది. అయితే ఇపుడు చూస్తే కచ్చితంగా మూడు నెలల కంటే సమయం తక్కువగా  ఉంది. సాహో అప్ డేట్స్ ఏమీ  బయటకు రావడంలేదు. ఈ సినిమాలో  ఇంకా ఒక సాంగ్, యాక్షన్ పార్ట్ బ్యాలన్స్ ఉందని అంటున్నారు.


ఇక ఇది బహు భాషా చిత్రం. దాంతో అన్ని భాషల్లో ఈ మూవీకి మీడియా హైప్ తీసుకురావాలి. అంటే అన్ని చోట్లా ప్రెస్ మీట్లు పెట్టుకోవాలి. మరి ప్రభాస్ కానీ యూనిట్ కానీ ఇంతవరకూ ఆ వైపుగా ద్రుష్టి పెట్టలేదు. మరి ఎపుడు సినిమా రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు, 200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న మూవీ ఇది. దాంతో ఫ్యాన్స్ ఇచ్చిన మాటను ప్రభాస్ తప్పకుండా తప్పెట్లున్నాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: