జగన్ కోసం ఎంతో మంది ప్రార్ధిస్తున్నారు. పదేళ్ళ పోరాటానికి తుది విజయం దక్కాలని అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. జగన్ ఈసారి సీఎం అవుతారని కూడా అంతా గట్టిగా నమ్ముతున్నారు. అటు సినీ లోకం, ఇటు రాజకీయ లోకం కూడా జగన్ రావాలి, కావాలంటోంది.


ఇదిలా ఉండగా నిన్నటి ఎన్నికల్లో జగన్ కు  అనుకూలంగా ప్రచారం చేసిన ఇద్దరు సినిమా నటులు జగన్ సీఎం కావలంటూ తిరుమల తిరుపతి దేవుణ్ణి కాలి నడకన వెళ్ళి దర్శించుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఈ సందర్భంగా  సినీ నటుడు పృథ్వీరాజ్ అన్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మరో నటుడు  జోగి నాయుడుతో కలిసి ఆయన  కాలి నడకన తిరుమల కొండపైకి చేరుకున్నారు. 


ఈ రొజు  శ్రీవారిని దర్శించుకొని, స్వామివారికి తలనీలాలు కూడా చెల్లించుకుంటానని పృథ్వీరాజ్ తెలిపారు. ఇడుపులపాయలో వైఎస్సార్ స్మారక చిహ్నాన్ని సందర్శిస్తామని చెప్పారు. కాగా జగన్ సీఎం అవుతారని మరో వైపు జ్యోతీష్యులు ముహూర్తాలు పెడుతుంటే టాలీవుడ్ కూడా అయన రాక కోసం ఎదురుచూస్తోంది. జగన్ విప్లవాత్మకమైన మార్పులు ఏపీలో తీసుకువస్తారని బలంగా నమ్ముతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: