అల్లు శిరీష్ ఎదో విధంగా హిట్ కొట్టాలి అన్న కసితో చేస్తున్న ‘ఏబీసీడీ’ ఈవారం విడుదల కాబోతోంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఏబీసీడీకి ఇది రీమేక్. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఈమధ్య జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లు శిరీష్ తన పై తాను వేసుకున్న సెటైర్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.  

ఈ ఫంక్షన్ లో శిరీష్ మాట్లాడుతూ తన సినిమాలు ఫ్లాప్ అవుతున్న పరిస్థుతులలో చరణ్ ఈ ‘ఏబీసిడి’ సినిమా గురించి చెప్పి ఆసినిమాను తెలుగులో చేయమని తనకు సూచన ఇచ్చిన విషయాన్ని బయటపెట్టాడు. ఈసినిమాలో కొన్ని సన్నివేశాలు తన నిజ జీవితంలో జరిగిన వాస్తవాలు అని చెపుతూ ఒక ఆసక్తికర విషయాన్ని వివరించాడు. 

చరణ్ కు అదేవిధంగా అల్లు అర్జున్ కు 21 ఏళ్లు వచ్చిన తర్వాత అరవింద్ కార్లు కొని ఇచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుంటూ తనకు కూడ 21 సంవత్సరాలు వచ్చిన తరువాత తన తండ్రిని కారు కొని ఇమ్మని అడిగిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు. అయితే తన తండ్రి ఏ కారు కావాలని అడిగితే స్పోర్ట్స్ కారు కావాలి అని అడిగితే అప్పట్లో తన రేంజ్ కి టూవీలర్ కూడ ఎక్కువ అనీ జోక్ చేయడంతో తనకు తనతండ్రి పై కోపం తనలో కసి పెరిగిన విషయాన్ని బయటపెట్టాడు. 

అయితే ఆ తరువాత తాను సినిమాలలో నటించిన పారితోషికంతో తనకు నచ్చిన స్పోర్ట్స్ కారు కొనుక్కున్నప్పుడు తన తండ్రి తనకు గిఫ్ట్ ఇవ్వలేదు అన్న కోపం పోయింది అనీ ఆనాడు తన తండ్రి అలా అనకుండా ఉంటే తాను హీరోగా ఈ రేంజ్ కి వచ్చి ఉండే వాడిని కాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.  దీనితో ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది శిరీష్ అప్పుడే తనకు తానుగా హీరోగా సెటిల్ అయిపోయానని భావిస్తున్నాడా అంటూ జోక్స్ వేసుకున్నట్లు సమాచారం..   



మరింత సమాచారం తెలుసుకోండి: