రీసెంట్గా తెలుగు టెంపర్ రీమేక్ తో కోలీవుడ్లో జోరు మీదున్నాడు. 'అయోగ్య' పేరుతో రిలీజైన ఈ సినిమా హిట్ టాక్ ని తెచ్చుకొని సక్సస్ ఫుల్ గా రన్నవుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సీన్ అందరిని బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా విశాల్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమని విశాల్ సన్నిహితులు చెబుతున్నారట. అంతేకాదు క్లైమాక్స్ లో విశాల్ చనిపోయే సీన్ హైలెట్ అని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాక్.
ఇక ఈ సినిమా కంటే ముందు వచ్చిన 'అభిమన్యుడు' కూడా విశాల్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ గా నటించాడు. ప్రస్తుతం విశాల్ ఈ సినిమాకి సీక్వెల్ గా 'అభిమన్యుడు-2' తెరకెక్కించే పనిలో ఉన్నాడు. నూతన దర్శకుడు తెరకెక్కించబోయో ఈ సినిమాలో కూడా విలన్ గా అర్జున్ నటిస్తున్నారు. ఇక హీరోయిన్ గా సమంత నే నటింపజేయాలని విశాల్ ప్రయత్నిస్తున్నాడు.
వీటితో పాటు విశాల్ మరో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. ఈ కొత్త సినిమాలో ఆర్మీ ఆఫీసర్గా నటిస్తున్నారు. అంతేకాదు విశాల్ కి జోడీగా శ్రద్ధ శ్రీనాథ్ నటిస్తోంది. ఆనంద్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ శ్రద్ధ పోలీసు అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే ఫొటో షూట్ కూడా నిర్వహించారట. ‘కె 13’చిత్రంలో నటించి మెప్పించింది శ్రద్ధ. అంతేకాకుండా ఆమె అజిత్ హీరోగా నటిస్తున్న ‘నేర్కొండ పార్వై’లో ముఖ్యపాత్ర పోషిస్తోంది. ఇక రీసెంట్గా నానీకి జోడీగా నటించిన 'జెర్సీ' సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే.