తెలుగు ఇండస్ట్రీలోకి ‘దేవదాసు’చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రామ్ తక్కువ టైమ్ లోనే ఎనర్జిటిక్‌ స్టార్‌  గా మంచి పేరు తెచ్చుకున్నాడు.  నేను శైలజ చిత్రం తర్వాత ఈ హీరోకి ఏ ఒక్క చిత్రం కలిసి రాలేదు.  ఇక టెంపర్ చిత్రం తర్వాత పూరి జగన్నాధ్ కి కూడా ఒక్క హిట్ పడలేదు.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్' రూపొందుతోంది. రామ్ సరసన కథానాయికలుగా నిధి అగర్వాల్ - నభా నటేశ్ నటిస్తున్నారు.


ఇప్పటికే ఈ చిత్రం చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. పాటల చిత్రీకరణకిగాను త్వరలో ఈ చిత్ర విదేశాలకి వెళ్లనుంది.నేడు హీరో రామ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రం టీజర్‌ను విడుదల చేశారు. ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అని రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెప్తున్న సన్నివేశంతో టీజర్‌ మొదలైంది.


డ్యాన్స్‌, ఫైటింగ్‌ సన్నివేశాల్లో రామ్‌ చాలా స్టైలిష్‌గా ఉన్నారు. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని చివర్లో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. ఈ చిత్రం చూస్తుంటే హైదరాబాద్ గల్లీ పోరగాళ్లు ఎలా ఉన్నారో కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నట్లుందని అంటున్నారు టీజర్ చూసిన వారు.  మొత్తానికి పూరి, రామ్ ఓ సేన్సేషన్ క్రియేట్ చేయబోతున్నారని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో చిత్రీకరణ జరుగుతోంది. మరో మూడు పాటలు చిత్రీకరిస్తే షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. జూన్‌ చివరివారంలో కానీ, జులైలో కానీ ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: