తెలుగు ఇండస్ట్రీలో అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్ 100’చిత్రంతో మంచి విజయం అందుకొని తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరో కార్తికేయ.   ఈ చిత్రం తర్వాత మనడికి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి.  తాజాగా టీఎన్‌ కృష్ణా దర్శకత్వంలో కార్తికేయ హీరోగా నటిస్తున్న చిత్రం  ‘హిప్పీ’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ ఈ మద్య రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ వస్తుంది. 

కార్తీక్ సరసన . దిగంగనా సూర్యవంశీ, జజ్బా సింగ్ నటిస్తున్నారు.  తాజాగా ఈ చిత్రం నుంచి  ‘ఎవత్తివే ఎవత్తివే.. ఎదనుపట్టి వదలవే..’ అన్న లిరికల్‌ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో కార్తికేయ ఇద్దరు కథానాయికలతో రొమాన్స్‌ చేస్తూ కనిపించారు. అనంత్‌ శ్రీరామ్‌ ఈ పాటకు సాహిత్యం అందించారు. 

అయితే సంగీతం సమకూర్చిన నివాస్‌ కే ప్రసన్నతో కలిసి కార్తిక్‌ ఈ పాటను ఆలపించారు. వీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై కలైపులి ఎస్‌ థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: