సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అయన కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాగా వచ్చిన మహర్షి, కొంత ఎబోవ్ యావరేజ్ టాక్ సంపాదించినప్పటికీ, రోజురోజుకూ అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో మంచి కలెక్షన్లు సాధిస్తూ సూపర్ హిట్ దిశగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదలై ఐదు రోజలు అవుతున్నప్పటికీ కూడా చాలా చోట్ల కలెక్షన్లు ఏమాత్రం తగ్గకుండా ఇప్పటికీ స్టడీగానే వున్నాయి. నిజానికి ఈ సినిమా కలెక్షన్ల ప్రభంజనాన్ని చూసి సినిమా విశ్లేషకులు సైతం నోరెళ్లబెడుతున్నారు.

ఇకపోతే సినిమా కలెక్షన్లు మరింత పెంచేందుకు చిత్ర యూనిట్ రకరకాలుగా ప్రమోషన్లు, ఇంటర్వ్యూ ల రూపంలో సినిమాకు మరింత క్రేజ్ ను తీసుకువస్తున్నాయి. అంతేకాదు మహేష్ బాబు కూడా ఈ చిత్ర విజయం తరువాత పర్సనల్ గా ఫ్యామిలీతో కలిసి టూర్ వెళదామని అనుకున్నారని, అయితే సినిమా ప్రమోషన్ల కోసం అది కూడా విరమించుకున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇకపోతే ఇవాళ మహర్షి యూనిట్ నుండి బయటికొచ్చిన ఒక వార్త మహేష్ అభిమానులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అనే చెప్పాలి. 


అదేంటంటే, సూపర్ స్టార్ మహేష్, దర్శకుడు వంశీ, నిర్మాత దిల్ రాజు సహా మరికొందరు చిత్ర యూనిట్ సభ్యులు మహర్షి సినిమాని హైదరాబాద్ లో మహేష్ బాబు అడ్డాగా మారిన సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో నేడు సాయంత్రం అభిమానులతో కలిసి వీక్షించనున్నారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

ఇక అలా పోస్ట్ వచ్చిందో లేదో, వెంటనే నేటి ఈవెనింగ్ షోకి టికెట్స్ క్షణాల్లో హాట్ కేక్స్ లా అమ్ముడుపోయాయి. ఇక మరొక గమ్మత్తైన విషయం ఏమిటంటే, మహేష్ బాబు చాలా ఏళ్ళ క్రితం సుదర్శన్ లో అభిమానులతో కలిసి సినిమా వీక్షించారని, అయితే మళ్ళి ఇన్నేళ్ల తరువాత ఆయన తమతో కలిసి సినిమా చూడడం ఎంతో హ్యాపీగా ఉందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇకపోతే నేడు మహేష్ రానున్న సందర్భంగా సుదర్శన్ థియేటర్ ను రకరకాల పూలదండలు మరియు హంగులతో అభిమానులు మరియు థియేటర్ యాజమాన్యం ఎంతో సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక నేడు మహేష్ బాబు థియేటర్ కు వచ్చి సినిమా చూసే సమయంలో అయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. నిజంగా ఇది సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి నిజమైన పండుగ సంబరం అనే చెప్పాలి.... 


మరింత సమాచారం తెలుసుకోండి: