టాలీవుడ్‌లో క్రికెట్‌ ఎంత‌గానో ఇష్ట‌ప‌డే హీరోలు ఎవ‌రంటే వెంట‌నే జ‌నాల మైండ్ సెట్‌కి వ‌చ్చే పేరు విక్ట‌రీ వెంటేష్. మ్యాచ్‌లు ఎక్క‌డ జ‌రిగినా ఇండియా కానీ స‌న్ రైజ‌ర్స్‌ కానీ ఎప్పుడైనా స‌రే వెంక‌టేష్ హాజ‌రు అవుతారు. క్రికెట్‌ అమితంగా ఇష్ట‌ప‌డేవారిలో మ‌హేష్ కూడా ఒక‌రు. కానీ ఆయ‌న ఆ ఇష్టాన్ని చూప‌డం త‌క్కువే. మ‌హేష్ & వెంకీ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సినిమా సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు. ఆ సినిమాలో వీరిద్ద‌రి పాత్ర‌లైన‌ పెద్దోడా, చిన్నోడా పేర్లు జ‌నాల హృద‌యాల్లో నిలిచిపోయాయి.

మరి వెంక‌టేష్ క్రికెట్‌పై ఇష్టాన్ని మ‌హ‌ర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సినిమా స‌క్సెస్‌ను వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్లో ధోని సిక్స్‌తో పోల్చిన సంగ‌తి తెలిసిందే. ఇక త్వ‌ర‌లో యూకేలో  ప్రారంభం కానున్న ప్ర‌పంచ క‌ప్ కోసం ఇండియా మ్యాచ్‌లు ఎంజాయ్ చెయ్య‌డానికి ఈ ఇద్ద‌రు హీరోలు వెళ్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇండియా ప్ర‌పంచ‌క‌ప్‌లో ఆడే లీగ్ మ్యాచులు చూసి... సెమిస్ చేరితే టూర్‌ కొన‌సాగిస్తార‌ని చ‌ర్చించుకుంటున్నారు. ఇక నిర్మాత సురేష్ బాబు కూడా ఇందులో జాయిన్ అవుతున్నార‌ట‌. దీనికి అనుగుణంగా ఎవ‌రికి వారు.. వారి షెడ్యూల్‌ ప్లాన్ చేసుకుంటున్నార‌ట‌.

ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం కావ‌డానికి మ‌రి కొంత స‌మ‌యం ఉండ‌డంతో మ‌హేష్‌కు రిలాక్స్‌ టైమ్‌ దొర‌కింది. దీంతో మ‌హేష్‌ హ్యాపీగా మ్యాచ్‌లు ఎంజాయ్ చెయ్య‌డానికి టైమ్ దొర‌కిన‌ట్టు అయ్యింది. ఫైన‌ల్‌గా యూకేలో ప్ర‌పంచ క‌ప్ కోసం జ‌రిగే మ్యాచ్‌ల‌కు ఇండియా త‌ర‌పున మ‌రింత జోష్ ఇవ్వ‌డానికి ఈ ఇద్ద‌రు టాలీవుడ్ హీరోలు రెడీ అవుతున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: