ఆలీ హీరోగా పెదరావురు ఫిలిం సిటీ పతాకం పై గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించిన జంధ్యాల మార్క్ కామెడీ సినిమా 'పండుగాడి ఫోటోస్టూడియో' .ప్రస్తుతం ఈ చిత్రం  షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడుదిలీప్ రాజా మాట్లాడుతూ  'స్టార్ డైరెక్టర్ సుకుమార్ గారు ఒకే చేసిన కధ ఇది."వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది" అనేది  ఈ చిత్ర క్యాప్షన్ .

ఈ చిత్రం లో హీరో కు 40 ఇయర్స్ వచ్చేవరకు పెళ్లికాదనే  నాగ దేవత శాపం ఉంటుంది అ క్రమంలో హరోయిన్ కంచు కనకరత్నం పరిచయం జరగడం,అమెతో ప్రేమలో పడటం మరోపక్క శాపం వల్ల జరిగే పరిణామాలే ఈ చిత్ర కదాంశం. పూర్తి హాస్య భరిత చిత్రమిది.1150 చిత్రాల్లో  నటించిన ఆలీ గారు ఈ చిత్రం లో హీరోగా అద్భుతమైన  నటనని ప్రదర్శించారు.హీరోయిన్ గా రిషిత ను పరిచయం చేస్తున్నాము. కుటుంబ సభ్యులతో కడుపుబ్బా నవ్వుకునేలా పండుగ ఫోటో స్టూడియో సినిమా రూపొందించామన్నారు .

ఈ సినిమా  లో వినోద్ కుమార్ ,బాబు మోహన్, సుధ, జీవ, శ్రీలక్ష్మి రామ్ జగన్ లాంటి సీనియర్ నటులతో పాటు విలక్షణమైన పాత్రల్లో  సందీప్ రాజా, టీనాచౌదరి తొలి పరిచయం చేస్తున్నాం .ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జాన్ నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం. అని అన్నారు.   


ఈ చిత్రానికి నిర్మాత:గుదిబండి వెంకట సాంబిరెడ్డి,  సంగీతం:యాజమాన్య,ఎడిటర్: నందమూరి హరి, కెమెరా:మురళీమోహన్ రెడ్డి,ఫైట్స్:షావాలిన్ మల్లేష్,  డాన్స్:రఘు మాష్టర్,అజేయ శివశంకర్, అమ్మ  సుదీర్, దర్శకత్వం,:దిలీప్ రాజా


మరింత సమాచారం తెలుసుకోండి: