దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే ఇక ఆ సినిమా రేంజ్ ఏంటో అందరికి తెలిసిందే. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి తెలిసేలా చేసిన జక్కన్న ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. రాం చరణ్, ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.


ఇద్దరి రియల్ హీరోస్ కొమరం భీం, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో రాం చరణ్, ఎన్.టి.ఆర్ నటిస్తారని తెలుస్తుంది. ఈ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ప్లాన్ చేసిన రాజమౌళి ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారట. మహేష్ తో జక్కన్న సినిమా కమిట్మెంట్ కొన్నాళ్ల క్రితమే జరిగింది.. కాని అది సెట్స్ మీద వెళ్లేందుకు మాత్రం టైం తీసుకుంది. 


మహేష్ స్టామినాకు తగినట్టుగానే బాహుబలి రేంజ్ లో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట రాజమౌళి. అందుకే మహేష్ మహర్షి రిలీజ్ అవడమే ఆలస్యం అనీల్ రావిపుడి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత కూడా త్రివిక్రంతో మరో సినిమా ఉంటుందని తెలుస్తుంది. దానితో పాటుగా సందీప్ వంగ సినిమా కూడా చేస్తాడట.   


ఆర్.ఆర్.ఆర్ రిలీజై ఆరు నెలలు గడిచే సరికి మహేష్ 2 లేదా 3 ప్రాజెక్టులు చేస్తాడట. ఆ తర్వాత రాజమౌళి సినిమా కోసం ఓ 2 ఏళ్లు డేట్స్ ఇస్తాడని టాక్. మొత్తానికి రాజమౌళితో మహేష్ సినిమా కోరుకునే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కల నెరవేరబోతుంది. బాహుబలి లాంటి సినిమా అంటే ఇకా రికార్డులన్ని ఖల్లాస్ అని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: