ఈ మద్య తెలుగు ఇండస్ట్రీల వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా తెలుగు ఇండస్ట్రీలో స్పెషల్ ఎఫెక్ట్స్ కింగ్ గా పేరు సంపాదించుకున్న ప్రముఖ టెక్నీషియన్ ఏక్‌నాథ్‌ (70) మృతి చెందారు.  ఇప్పుడు గ్రాఫిక్స్, వ్యూజువల్ ఎఫెక్ట్ లాంటివి వస్తున్నాయి.  లేనిది ఉన్నట్లు..ఉన్నది లేనట్లుగా భ్రమింప జేస్తున్నాయి.  అయితే  55 ఏళ్ల క్రితమే గ్రాఫిక్ మాయాజాలం చూపించారు అప్పటి స్పెషల్ ఎఫెక్ట్ మేకర్లు.  


పౌరాణిక చిత్రాల్లో బాణాలు సందించుకోవడం..ఆ బాణాలు రక రకాలుగా మారి యుద్దం చేయడం..గాల్లో చిత్ర విచిత్ర వాహనాలపై వెళ్లేలా భ్రమింప జేయడం..చిన్నగా మారడం..పెద్దగా మారడం..మాయం కావడం ఇలా ఎన్నో రకాల మూవ్ మెంట్స్ వెండి తెరపై ఆవిష్కరించారు.  ప్రముఖ టెక్నీషియన్ ఏక్‌నాథ్‌  కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన ఈయన 55 ఏళ్ల క్రితమే సినీ పరిశ్రమలో పని చేయడానికి మద్రాస్ వెళ్లిపోయారు. 


ప్రముఖ కెమెరామెన్ మోహనకృష్ణకి ఏక్‌నాథ్‌ సోదరుడు. ఈయన అమితాబ్, ఎన్టీఆర్, రజినీకాంత్, కమల్ హాసన్ ఇలా చాలా మంది అగ్ర హీరోల సినిమాలకు పని చేశారు. అప్పట్లో కంప్యూటర్ టెక్నాలజీ లేని రోజుల్లోనే ఎన్నో స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేసిన ఘనత ఏక్‌నాథ్‌ కి ఉంది.  'విఠలాచార్య' సినిమాలో అధ్బుత టెక్నాలజీ వాడారు. ఎన్నో త్రీడీ చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ గా పని చేసిన ఆయన తన కెరీర్ లో 700 చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్ సమకూర్చారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: