మెగాస్టార్ సినిమా అంటే అందిరిలోను భారి అంచనాలే ఉంటాయి అయితే ఈ అంచనాలు ఇంకో స్థాయీ కి తీసుకునివెళ్ళింది చిరు రీ-ఎంట్రి ఇచ్చిన ఖైది నెం 150 సినిమా. చిరు ఖైది సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా సైరా నరసింహ రెడ్డి. సైరా నరసింహ రెడ్డి ఒక తొలి స్వతంత్రయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కహ్దతో రూపొందిస్తున్న చిత్రం.

 

ఈ సినిమా లో మెగాస్టార్ తో పాటు నయనతార, అమితాబ్ బచ్చన్ , సుదీప్, జగపతిబాబు, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా కు సుర్రేంద్ర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అమిత్ త్రివేది ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

 

అయితే ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు వెయ్యి కళ్ళతో ఏదురుచుస్తున్నారు. సైరా సెట్స్ లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న నేపద్యం లో సినిమా దసరాకు వస్తుందా లేదా అనే సందేహాలు వచ్చాయి. అయితే అందరి అంచనాలు తిరగరాస్తూ రామ్ చరణ్ ఫ్యాన్స్ కి షాక్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నాడట.

 

ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం . ఈ చిత్రం లో హై వోల్టజ్ సన్నివేశాలును చిత్రీకరిస్తున్నారు మేకర్స్. త్వరలో షూటింగ్ పూర్తీ అవ్వనుంది. అయితే ఈ సినిమా దసరాకు విడుదల చేద్దాం అని మేకర్స్ ప్లాన్ చేసారట కానీ రామ్ చరణ్ ఈ సినిమా ను దసరా కంటే ముందే అక్టోబర్2వ తేదిన విడుదల చేద్దాం అని అందరిని షాక్ గురి చేసారట . దీంతో ప్రొడక్షన్ కి సంబంధించి అన్ని పనులను వేగంగా పూర్తీ చేస్తున్నారని సమాచారం.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: