హిందీలో అజయ్ దేవగన్ సరసన రకుల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా తన ఖాతాలో బాలీవుడ్ హిట్ వేసుకోవాలని కలలు కంటున్న రకుల్ తాజాగా దే దే ప్యార్ దే సినిమాలో గ్లామర్‌ను భారీగా పండించింది. అయితే రకుల్ గ్లామర్ మోతాదును తట్టుకోలేకపోయిన సెన్సార్ బోర్డు భారీగా కత్తెర్లు వేసింది. దాంతో రకుల్ నీరు కారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.  దేదే ప్యార్ దే చిత్రంలోని పాటల్లో రకుల్ ప్రీత్ సింగ్ బోల్డుగా నటించింది.


ఈ చిత్రంలోని వడ్డీ షర్బాన్ పాటలో మద్య సేవిస్తూ తెగ చిందులేసింది. చేతిలో మద్య బాటిల్‌తో, నూడుల్ స్ట్రాప్ జాకెట్‌ ధరించి వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అయితే అలా బోల్డుగా హాట్ హాట్‌గా నటించిన పాటలోని ఓ సన్నివేశంపై సెన్సార్ బోర్డు కత్తెరేసింది. మద్యం బాటిల్ ఉన్న సీన్‌ను కత్తిరించేసి.. ఆ స్థానంలో ఫ్లవర్ బోకేను పెట్టమని సూచించింది. 


ఇంకా దే దే ప్యార్ దే సినిమాలోని కొన్ని సీన్లపై, డబుల్ మీనింగ్ డైలాగులపై సెన్సార్ కన్నెర్ర జేసింది. ఓ హాట్ సీన్‌లో ఫెర్ఫార్మెన్స్‌ బెటర్ హోతీ హై అనే డైలాగ్‌ను తొలగించింది. దాంతో ఆ సీన్‌కు సంబంధించిన కొన్ని దృశ్యాలను లేపిసింది. మంజు జీ కే ఆలూ ఓ ఓ.. వహీ అచ్చే హై అనే డైలాగ్‌పై కత్తెర పెట్టింది. ఇలా హాట్ హాట్ సీన్లపై సెన్సార్ కత్తెర్లు పడటంతో చిత్ర యూనిట్ నీరు కారినట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: