సినిమా రంగంలో ఉన్న సెల‌బ్రిటీలు ఏం చేసినా అది వార్త అయిపోతూ ఉంటుంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బాహుబ‌లి సీరిస్ సినిమాల‌తో నేష‌న‌ల్ స్టార్‌గా ఎదిగిన యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సెన్షేష‌న‌ల్ స్టార్‌గా మారిపోయాడు. ఇక ప్ర‌భాస్ గురించి తాజాగా ఓ వార్త ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌భాస్ ఇప్ప‌టికే యూవీ క్రియేష‌న్స్ ద్వారా త‌న స్నేహితుల‌తో క‌లిసి ఇటు థియేట‌ర్ల వ్యాపారంతో పాటు డిస్ట్రిబ్యూష‌న్ రంగంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భాస్ ఇప్పుడు త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ టీవీ ఛానెల్ కూడా స్టార్ట్ చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ విషయంపై ప్ర‌భాస్‌, ఆయ‌న స‌న్నిహితుల నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న‌లు అయితే రాలేదు. అయితే అప్పుడే కొన్ని తెలుగు మీడియా ఛానెల్స్ ఈ వార్త‌ను బాగా హైలెట్ చేస్తున్నాయి. గ‌తంలో సినిమా రంగాన్ని ఏలిన వారు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయ్యారు. ఇప్పుడు సినిమాల్లో స్టార్ హీరోగా ఉన్న ప్ర‌భాస్ మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడంటే దాని వెన‌క పొలిటిక‌ల్ ఆలోచ‌న ఏదైనా ? ఉందా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ర‌న్ రాజా ర‌న్ ఫేం సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో సాహో సినిమాలో న‌టిస్తున్నాడు. రూ.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా ఆగ‌స్టు 15న రిలీజ్ కానుంది. ఈ సినిమా త‌ర్వాత జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చే జాన్ సినిమాలో చేస్తున్నాడు. సాహోను తెలుగు, త‌మిళ్‌, హిందీతో పాటు కొన్ని భార‌తీయ భాష‌ల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఏదేమైనా ప్ర‌భాస్ మీడియా ఎంట్రీ వార్త‌లు ఇప్పుడు తెలుగు మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: