ఈ ఏడాది భారీ విజయం సాధించిన సినిమాల్లో మహర్షి ఒకటి.  ఇప్పటికే వందకోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసింది.  మహేష్ తనపంథాకు విరుద్ధంగా మొదటిసారి సినిమా రిలీజ్ అయ్యాక దర్శక నిర్మాతల కోరిక మేరకు సినిమా ప్రచారం చేస్తున్నాడు.  రిలీజ్ తరువాతతన కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లే మహేష్ బాబు ఇలా మొదటిసారి  పాల్గొంటున్నాడు.  


మహర్షికి నైజాంలో బ్రహ్మరధం పడుతున్నారు.  ఒక్క నైజాం ఏరియాలోనే మహర్షి దాదాపుగా రూ.20 కోట్ల రూపాయలకు పైగా వసూలుచేసింది.  వీకెండ్ ఫార్మింగ్ ఛాలెంజ్ కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ రావడం సినిమాలు ప్లస్ అయింది.  ఇదిలా ఉంటె, తాజా సమాచారంప్రకారం, మహర్షి సినిమాలో కొన్ని సీన్స్ ను యాడ్ చేయబోతున్నారని తెలుస్తోంది

Image result for maharshi  images

మహేష్, అల్లరి నరేష్, పూజా హెగ్డేల మధ్య కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయట. నిడివి ఎక్కువగా ఉండటంతో సీన్స్ ను తొలగించారు.  అలాతొలగించిన కొన్ని సీన్స్ ను యాడ్ చేయబోతున్నారని తెలుస్తోంది.  ఇప్పటికే సినిమా నిడివి మూడు గంటల వరకు ఉంది.  ఇప్పుడు ఈసీన్స్ యాడ్ చేస్తే అది మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది.  మధ్యలో కొన్ని చోట్ల అనవసరమైన సీన్స్ ఉన్నాయి.  మరి వాటిని తొలగించిఈ కామెడీ సీన్స్ ను యాడ్ చేస్తారా లేదంటే, అదనంగా యాడ్ చేస్తారా అన్నది తెలియాలి

 


మరింత సమాచారం తెలుసుకోండి: