నాగచైతన్యతో పెళ్ళి అయిన తరువాత కూడ సమంత హవా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థుతులలో సమంతకు ‘జెర్సీ’ హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ఇచ్చిన ఊహించని షాక్ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘జెర్సీ’ మూవీలో ఈమె నటనకు మంచి ప్రశంసలు లభించడంతో పాటు ఆమె తమిళంలో నటించిన తొలి సినిమా ‘విక్రమ్ వేద’ కూడా హిట్ వచ్చింది.

ఇక ఆమె సొంత భాష కన్నడ భాషలో నటించిన ‘యు టర్న్’ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈసినిమాను సమంతతో తెలుగులో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థుతులలో ‘జెర్సీ’ ప్రమోషన్ లో పాల్గొన్న శ్రద్దా శ్రీనాథ్ ను ఒక మీడియా సంస్థ ప్రతినిధి ఆమధ్య తెలుగు ‘యు టర్న్’ చూశారా అని శ్రద్ధను అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ తాను సమంత నటించిన తెలుగు ‘యూటర్న్’ మూవీని ఒక అరగంట చూసి ఆపేశానని తన పాత్రలో మరొకరిని చూడలేకపోయానని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసి ఏకంగా సమంతకు షాక్ ఇచ్చింది.

ఈవిషయమై సమంత అభిమానులు శ్రద్దా శ్రీనాథ్ పై తీవ్ర అసహనం కూడ వ్యక్త పరిచారు. ఇలాంటి పరిస్థుతులలో ఈమె సమంతకు మరో ఊహించని షాక్ ఇచ్చింది. గత సంవత్సరం విశాల్ హీరోగా పి.ఎస్.మిత్రన్ రూపొందించిన ‘ఇరుంబు తిరై’ సైబర్ థ్రిల్లర్ సమంత విశాల్ కు జోడీగా నటించింది. ఈసినిమా తెలుగులో కూడ డబ్ అయి సమంతకు మంచిపేరు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ తీయబోతున్నారు. ఈసినిమాలో కూడ విశాల్ హీరోగా నటిస్తున్నాడు. అయితే హీరోయిన్ గా మాత్రం సమంత స్థానంలో శ్రద్దా శ్రీనాథ్ ను ఎంపిక చేయడం షాకింగ్ న్యూస్ గా మారింది. వాస్తవానికి ఈ సీక్వెల్ విషయంలో సమంత పేరును పరిశీలించకుండా శ్రద్దా శ్రీనాథ్ ను ఎంపిక చేయడం సమంతకు ఊహించని షాక్ గామారింది అని టాక్..  



మరింత సమాచారం తెలుసుకోండి: