టాప్ హీరోల కలెక్షన్స్ వ్యవహారం ఎప్పుడు వివాదాస్పదమే. సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎదుర్కోక తప్పదు. పదే పదే ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటూ మహేష్ కెరీర్ బెస్ట్ గ్రాస్ ని ఒక్క వారంలోనే దాటేసిందంటూ ఊకదంపుడు పోస్టర్లు విడుదల చేయడంతో మరోసారి ట్రాలింగ్ కి అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. గత ఏడాది కూడా అచ్చం ఇదే తరహాలో భరత్ అనే నేను కలెక్షన్స్ రంగస్థలంని దాటాయి అని చెప్పుకోవడానికి నానా తంటాలు పడ్డారు.


ఆఖరికి నిర్మాత దానయ్య ఈ విషయంలో చాలా మాటలు పడాల్సి వచ్చింది. పోస్టర్లలో ఉన్న ఫిగర్స్ నిజంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చాయా అనే ప్రశ్నలు ఎదురుకోవాల్సి వచ్చింది ఇప్పుడు మహర్షికి అదే రిపీట్ చేయడం ప్రిన్స్ ఫ్యాన్స్ కి సైతం నచ్చుతుందని చెప్పలేం. కొంత ఆలస్యం అయినా రికార్డులను జెన్యూన్ గా ఉన్నదీ ఉన్నట్టుగా టైంతో సంబంధం లేకుండా చెప్పమని వాళ్ళూ కోరుతున్నారు.


కానీ మహర్షి తగ్గడం లేదు. వసూళ్ల కంటే ఎక్కువగా టీమ్ చెబుతున్న మాటలే అతిశయోక్తిగా ఉన్నాయని అప్పుడే కామెంట్స్ పడుతున్నాయి. ఇక కొత్తగా విడుదల చేసిన పోస్టర్ వీటికి మరింత బలాన్ని చేరకూర్చేలా ఉంది. ఇప్పటిప్పుడు మహర్షిని ఆల్ టైం టాప్ గ్రాసర్ గా ప్రకటించకపోతే మహేష్ మార్కెట్ కు ఏదో డేంజర్ వచ్చిపడేలా ఉందన్న పబ్లిసిటీ చూస్తుంటే ఇంకో రెండు మూడు రోజుల్లో బాహుబలిని టచ్ చేస్తున్నాం అని చెప్పుకుంటారేమో అని అప్పుడే ట్రాలింగ్ మొదలయ్యింది.  కాస్త చూసుకో మహర్షీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: