సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌కు హిట్లు, ప్లాపుల‌తో సంబంధం లేకుండా క్రేజ్ ఉంటుంది. గ‌తేడాది ర‌జ‌నీ కాలా లాంటి ప్లాప్ మూవీతో పాటు 2.0 లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌లో కూడా న‌టించాడు. ర‌జ‌నీ కొద్ది రోజులుగా ట‌పా ట‌పా మంటూ సినిమాలు చేసుకుంటూ వ‌స్తోన్నా ర‌జ‌నీ రేంజ్‌కు త‌గ్గ హిట్ ప‌డ‌డం లేదు. లింగా, కబాలీ, కాలా వ‌రుస డిజాస్ట‌ర్లు. 2.0 కూడా అంచ‌నాలు రీచ్ కాలేదు. రిజ‌ల్ట్‌తో సంబంధం లేకుండా హిట్లు కొడుతోన్న ర‌జ‌నీ తాజాగా ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఇంకా చెప్పాలంటే మురుగ‌దాస్‌తో సినిమా చేయ‌డం ర‌జ‌నీ క‌ల‌. ఈ విష‌యాన్ని ర‌జ‌నీయే స్వ‌యంగా ఎన్నోసార్లు చెప్పాడు. ర‌జ‌నీ డ‌బుల్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ సినిమాకు ద‌ర్బార్ అనే టైటిల్ పెట్టారు. తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో ఏక‌కాలంలో ఈ సినిమా తెరకెక్క‌నుంది. ఇక ద‌ర్బార్‌కు సంబంధించి స్టోరీ లైన్ లీక్ అయ్యింది. ఈ సినిమాలో ర‌జ‌నీ ఓ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్‌ అధికారి పాత్రలో... ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా కనిపించనున్నాడు.

ర‌జ‌నీ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన ఓ సన్నివేశాన్ని కూడా ఇటీవల తెరకెక్కించారని సమాచారం. ఈ నెలాఖరులో తొలిషెడ్యూల్‌ పూర్తికానుందట‌. ఆ తర్వాత కొంత విరామం తీసుకుని రెండో షెడ్యూల్‌ను చిత్రీకరించనున్నారు. ఇదిలా ఉండగా ముంబయి చిత్రీకరణలో పాల్గొన్న రజనీకాంత్‌ తన సహ నటులు, సాంకేతిక కళాకారులతో కలిసి భోజనం చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాకుండా సెట్‌లో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్‌ విందు కూడా ఇచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: