కియారా అద్వానీ లస్ట్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో ప్రసారం అయిన లస్ట్ స్టోరీస్ అప్పట్లో ఎంత సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. ఇది నాలుగు భాగాలుగా వచ్చింది. ఇందులోని ఒక పార్టులో కియారా అద్వానీ నటించింది. ఇందులో ఆమె క్యారెక్టర్ బాగా బోల్డుగా ఉంటుంది. ఎన్నో కళలలో అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆమెకు.. భర్త వల్ల వైవాహిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి.


అప్పుడామె ఏం చేసిందనేదే ఈ సిరీస్ కథ. ఈ సిరీస్ లో భాగంగా కియారా స్వయంతృప్తి పొందే సీన్ ఒకటి ఉంటుంది. ఇది అప్పట్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అంతేకాదు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని కియారా వెల్లడించింది.


‘‘లస్ట్ స్టోరీస్ లో ఆర్గాజం (స్వయంతృప్తి) సీన్ గురించి మా కుటుంబ సభ్యులకు ముందే చెప్పాను. అందుకోసం వాళ్లను సన్నద్ధం చేశాను. కానీ మా అమ్మమ్మకు మాత్రం దీని గురించి తెలియదు. ఆమె ఒకసారి నాతో పాటు ఆ సీన్ను చూసింది. అప్పుడు ఆమె ముఖం తిప్పుకోకుండా చూడడం నేను గమనించాను. ఇది చూసిన తర్వాత ఆమె ఇది నటనలో భాగమే కాబట్టి పర్లేదు అంది. ఆమె బ్రిటిషర్ కావడంతో స్పోర్టివ్ గా తీసుకుంది’’ అంటూ కియారా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: