మెగాస్టార్ చిరంజీవి ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న చిత్రం సైరా న‌రసింహారెడ్డి. సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడ‌క్ష‌న్  బ్యాన‌ర్ పై రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తుండగా, తమన్నా యువరాణి పాత్రలో కనిపించనుంది.


ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ రామోజీ  ఫిలిం సిటీలో జరుగుతోంది. అనంతరం వారం రోజుల పాటు వికారాబాద్ అడవుల్లో మరో షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తయిన అనంతరం అన్నపూర్ణ ఏడు ఎకరాల్లో నిర్మించిన ప్రత్యేక సెట్‌లో తమన్నాతో కలిసి చిరు ఓ పాటకు స్టెప్పులేయనున్నారని సమాచారం. ఈ పాటతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని సమాచారం. అనంతరం నిర్మాణానంతర పనులు జరిపి, ఆగస్ట్ 15న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.


మ‌రి ఇంత భారీ బ‌డ్జెట్‌తో కూడుకున్న ఈ చిత్రం పై ప్రేక్ష‌కుల అంచ‌నాలు బానే వున్నాయి.  అంతేకాక స్టార్ క్యాస్ట్ కూడా చాలా పెద్ద‌ది. అంద‌రూ పెద్ద పెద్ద సీనియ‌ర్ న‌టులు ఇందులో న‌టించ‌డం మ‌రి ఫ్యాన్స్‌ను ఏ మాత్రం ఆక‌ట్టుకుంటుందో వేచి చూడాలి. చారిత్రాత్మ‌క క‌థ‌లు, బయోపిక్‌లు న‌డిచే టైం కాబ‌ట్టి పెద్ద‌గా భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని సినీ పండితుల స‌మాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: