మ‌హాన‌టి సావిత్రి బ‌యోపిక్‌లో న‌టించిన కీర్తిసురేష్ అటు తెలుగు ఇటు త‌మిళంలోను మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ సినిమా తరువాత కూడా తమిళంలో ఆమె స్టార్ హీరోల జోడీగా వరుస అవకాశాలను దక్కించుకుంటూ వెళుతోంది. కానీ తెలుగులో మాత్రం ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన ఒక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు యూరప్ లో జరుగుతోంది.


ప్రధాన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాకి 'సఖి' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. దాదాపు ఇదే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉందని అంటున్నారు. నరేంద్ర అనే యువకుడు ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, రాజేంద్ర ప్రసాద్, సీనియర్ నరేశ్, నదియా కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.


ఇక‌పోతే కీర్తిసురేష్ న‌టిస్తున్న 20చిత్రం అవ్వ‌గా తెలుగులో ఇది ఆమెకు మూడ‌వ చిత్రం.ఆమె మ‌హాన‌టి త‌ర్వాత కొన్ని త‌మిళ్ చిత్రాల్లో విజ‌య్‌, విక్ర‌మ్ స‌ర‌స‌న న‌టించింది. స‌ర్కార్‌, సామి-2 త‌ర్వాత విశాల్ స‌ర‌స‌న పందెంకోడి -2లో న‌టించి మంచి హిట్ ను కొట్టేసింది. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ స‌ర‌స‌న మ‌రో చిత్రంలో న‌టిస్తుంది. మ‌హేష్‌కోనేరు ఒక మంచి స‌క్సెస్‌ఫుల్ పీఆర్ ఓల్లో ఒక‌రు. చాలా త్వ‌ర‌గా మంచి పేరు తెచ్చుకుని మంచి స‌క్సెస్‌ఫుల్ ప్రొడ్యూస‌ర్‌గా పేరు తెచ్చుకోవాల‌ని ఆశిద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: