టాలీవుడ్ లో శ్రీ ఆంజనేయం సినిమా తర్వాత నటి ఛార్మికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొన్ని సినిమాల్లో నటించింది. గ్లామర్ పరంగా ఛార్మీకి ఎంతో క్రేజ్ ఉంది. ఛార్మీ పంజాబీ అమ్మాయే అయినా టాలీవుడ్ లో అచ్చ తెలుగు అమ్మాయిగా అందరి మనసు దోచింది. హీరోయిన్ గా క్రేజ్ తగ్గుతున్న సమయంలో ఐటమ్ సాంగ్స్ లో కూడా నటించింది ఛార్మీ. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ నిర్మాణ రంగం వైపు మొగ్గు చూపింది. ప్రస్తుతం నిర్మాతగా మారి దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలిసి సినిమాలు తీస్తోంది.
నేడు అందాల బొద్దుగుమ్మ ఛార్మీ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ప్రస్తుతం 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో బిజీగా ఉన్నట్లు తెలిపింది. ఇస్మార్ట్ శంకర్ టీజర్ కి ఊహించినదానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని.. యూనిట్ అంతా సంతోషంగా ఉందని తెలిపింది. అంతే కాదు తనకు దర్శకుడు పూరి జగన్నాధ్ అంటే ఎంత ఇష్టమో..ఎంత పిచ్చో చెప్పింది.
టాలీవుడ్ లోకి వచ్చిన తర్వాత ఎంతో మందిన నటీ,నటులు, దర్శకులత పని చేశానని..అందరిల తనకు పూరి జగన్నాధ్ అంటే చాలా స్పెషల్ అని చెప్పారు. ఎంత ఇష్టమంటే..పూరి డైరెక్ట్ చేసిన 'పోకిరి', నేను నటించిన 'పౌర్ణమి' సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. అయితే తాను నటించిన సినిమా పౌర్ణమి చూడకుండా పూరి తీసిన ‘పోకిరి’సినిమా చూశానని..ఆ సినిమా ఆయన స్టామినా ఏంటో చూపించిందని అన్నారు.