జై సింహ తర్వాత నందమూరి బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్ లో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. బాలయ్య రీసెంట్‌గా వచ్చిన ఎన్.టీ.ఆర్ బయోపిక్ ఫ్లాప్ అవడంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ ని కొట్టాలానే పట్టుదలతో ఉన్నాడు. అందుకు తగ్గట్టుగానే రవికుమార్ చెప్పిన మాస్ అండ్ యాక్షన్ స్టోరీని ఫైనల్ చేసుకొని సెట్స్ పైకి వెళ్ళారు.


ఈ సినిమాతో పాటు బాలయ్యకు లెజెండ్, సింహ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా బలయ్య-రవికుమార్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్ ఎవరా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ సినిమాలో బాలయ్య సరసన యంగ్ బ్యూటీ ఆర్.ఎక్స్.100 ఫేం పాయల్ రాజ్ పుత్ నటిస్తుందని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హల్‌చల్ చేసింది. ఎందుకంటే పాయల్ ఇప్పటికే వెంకీ, రవితేజ సినిమాలలో హీరోయిన్‌గా ఒప్పుకుంది. అందుకే బాలయ్యతో కూడా నటించడానికి ఓకే చెప్పిందని అనుకున్నారు. అయితే బాలయ్య సరసన పాయల్ నటించడం లేదనేది లేటెస్ట్ అప్‌డేట్ . ఈ విషయాన్ని చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ స్వయంగా తెలిపారట.


మరింత సమాచారం తెలుసుకోండి: