తెలుగు లో ఎంతో పాపులారిటీ సంపాదించిన కార్యక్రమాల్లో ‘పటాస్’ఒకటి. ఈ కార్యక్రమంలో రాములమ్మగా నటి శ్రీముఖ యాంకరింగ్ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. ఆమెతో పాటు మెయిల్ యాంకర్ రవి స్టూడెంట్స్ తో చేసే హంగామా అంతా ఇంతా కాదు. మొదట్లో ఈ ప్రోగ్రామ్ పై పలు విమర్శలు వచ్చినా..తర్వాత బుల్లితెర ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే... అనసూయ, రష్మిల తర్వాత గ్లామర్ తీసుకొచ్చిన యాంకర్స్ లో శ్రీముఖి కూడా చేరిపోయింది. నాన్ స్టాప్ గా సందడి చేస్తూ 'పటాస్' షోను ఒక రేంజ్ కి తీసుకెళ్లింది.
శ్రీముఖి కోసమే ఈ షో చూసేవాళ్లు వున్నారనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. తెలుగులో బిగ్ బాస్ రెండు సీజన్ లను పూర్తి చేసుకొని మూడో సీజన్ కి సిద్ధమవుతుంది. జూలై నెల రెండో వారం నుండి ఈ షో ప్రారంభం కానుంది. గత కొంత కాలంగా ఈ షోలో పాల్గొనబోయే 17 మంది కంటెస్టంట్ లు ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది. మొదటి సీజన్ బాగానే సాగినా..రెండో సీజన్ మాత్రం ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి. ఆ ఇంపాక్ట్ షో రేటింగ్స్ పై కూడా పడింది. సీజన్ 3 విషయంలో అలాంటి రిస్క్ చేయాలని భావించడం లేదట బిగ్ బాస్ యాజమాన్యం.
అందుకే ఫేమస్ సెలబ్రిటీలను బిగ్ బాస్ 3 షోకి తీసుకురాబోతున్నారట. ఈ నేపథ్యంలో బుల్లితెరపై ‘పటాస్’తో మంచి పాపులారిటీ సంపాదించిన శ్రీముఖిని తీసుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే శ్రీముఖ ‘పటాస్’ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తుంది. అందుకే కొన్నాళ్లపాటు శ్రీముఖి 'పటాస్'కి బ్రేక్ ఇచ్చింది బిగ్ బాస్ షో కోసమే అంటూ వార్తలు ఊపందుకున్నాయి.