ఇండియ‌న్ ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంలో ఇది ఊహించ‌ని ప‌రిణామం. హిందీ సినిమా ప‌రిశ్ర‌మ‌లో విల‌క్ష‌ణ‌మైన న‌టుడిగా అజ‌య్ దేవ్‌గ‌న్ పేరు తెచ్చుకున్నారు. కాజోల్‌ను పెళ్లి చేసుకున్నారు. చాప కింద నీరులా సినీ న‌టులు త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించుకుంటూ వెళుతున్నారు. ఓ వైపు సినిమా స్టార్స్ మ‌రో వైపు క్రీడాకారులు త‌మకు అనువైన రంగాల‌ను ఎంచుకుంటూ ఆదాయాన్ని గ‌డిస్తున్నారు. స‌చిన్ రెస్టారెంట్ల‌లో పెట్టుబ‌డులు పెడితే . ప్ర‌స్తుత ఇండియ‌న్ క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి క్రీడాకారుల‌కు సంబంధించిన వ‌స్తువులు త‌యారు చేసే కంపెనీలో భారీగా పెట్టుబ‌డులు పెట్టారు.


అంతేకాకుండా తానే ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ప్ర‌మోట్ చేస్తున్నాడు. ఇది కూడా వ్యాపారాన్ని ఎలా విస్త‌రించుకుంటూ పోవ‌చ్చో వీరిని చూస్తే తెలుస్తుంది. ఈ స్పోర్ట్స్ స్టార్ట‌ప్ కంపెనీ బెంగ‌ళూరు కేంద్రంగా ప‌నిచేస్తోంది. ఇక సినిమా రంగానికి వ‌స్తే హిందీలో అమితాబ్ బ‌చ్చ‌న్ ఎక్సెల్ గ్రూప్, బిగ్ బి గ్రూపుల ద్వారా ఇప్ప‌టికే పెట్టుబ‌డులు పెట్టారు. భారీగా ఆదాయాన్ని పొందారు. షారూఖ్ ఖాన్ ఐపీఎల్ రంగంలోకి ప్ర‌వేశించాడు. ఏకంగా బిడ్ లో పాల్గొన్నాడు. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ టీంకు ఆయ‌నే ఫ్రాంచైజీగా ఉన్నారు. ఈసారి జ‌రిగిన టోర్నీలో పూర్ ఫ‌ర్‌ఫార్మెన్స్ క‌న‌బ‌రిచింది. 


సొట్ట బుగ్గుల సుంద‌రి ప్రీతిజింతా ఇప్ప‌టికే మ‌రో ఐపీఎల్ పంజాబ్ ఎల‌వ‌న్ టీంకు స్పాన్స‌ర్‌గా ఉంది. షారూఖ్, స‌ల్మన్, అక్ష‌య్ కుమార్, మాధురి దీక్షిత్..ఇలా న‌టులు, న‌టీమ‌ణులు త‌మదైన రంగంలో దూసుకెళుతున్నారు. రాను రాను థియేట‌ర్ల వైపు క‌న్నెత్తి చూడ‌డం లేదు  ప్రేక్ష‌కులు. వారి అభిరుచులు మారాయి. అందుకు అనుగుణంగా ఆయా ప‌ట్ట‌ణాల్లో మ‌ల్లీ ప్లెక్స్ థియేట‌ర్లు వెలుస్తున్నాయి. దీనిపైనే న‌టుడు అజ‌య్ దేవ‌గ‌ణ్ దృష్టి పెట్టారు. భారీ పెట్టుబ‌డులు పెట్టారు. నార్త్ ఇండియాను టార్గెట్ చేశారు. మొత్తం మీద 250  తెర‌ల్ని ఏర్పాటు చేయ‌నున్నారు. 


నార్త్, వెస్ట‌ర్న్ ప్రాంతాల్లో వీటిని నెల‌కొల్ప‌నున్నారు. ఇందు కోసం భారీగా నిధులు ఖ‌ర్చు పెట్టేందుకు రెడీ అయ్యారు. ఎన్ వై సినిమా లిప్స్ పేరుతో కంపెనీని నెల‌కొల్పారు. ఈ 50 ఏళ్ల వ‌య‌స్సున్న అజ‌య్ ..తాను ఇటీవ‌లే న‌టించిన సింగం బ్లేరింగ్ సినిమాను ఈ మల్టీప్లెక్స్‌ల‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. రాం గోపాల్ వ‌ర్మ తీసిన కంపెనీ సినిమాలో అజ‌య్ అద‌ర‌గొట్టాడు. న్యూ టెక్నాల‌జీ, విజువ‌ల్ ఎఫెక్ట్స్ ..డిజిటిల్ తో కూడిన సౌండ్ సిస్టం ..ఇలా ప్రేక్ష‌కుల‌ను మైమ‌రిచి పోయేలా చేయ‌నున్నాయి ఈ మ‌ల్టీప్లెక్స్‌లు. పెట్టిన పెట్టుబ‌డి రాబ‌డి వ‌చ్చేలా ప్లాన్ చేస్తున్నాడు అజ‌య్.


మరింత సమాచారం తెలుసుకోండి: