కాజల్ అగ్ర్వాల్..ఈ పేరు చెబితే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ తో కాజల్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు గుర్తొస్తాయి. అంతే కాదు ఈ రెండు ఇండస్ట్రీలలో కాజల్ కి ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ కూడా ఉంది. పన్నెండేళ్ల క్రితం తేజ రూపొందించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోలందరితోనూ నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. 


ఇక లక్ష్మీ కళ్యాణం తో కాజల్ ను ఇండస్ట్రీకి  పరిచయం చేసిన డైరెక్టర్ తేజ అంటే కాజల్ కు ప్రత్యేకమైన అభిమానం గౌరవం ఉంది. అందుకే ఇప్పటివరకు 3 సినిమాలు తేజ దర్శకత్వంలో చేసింది. నేనే రాజు నేనే మంత్రి తర్వాత కాజల్ మూడోసారి తేజ దర్శకత్వంలో సినిమా చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ హీరోహీరోయిన్లుగా తేజ 'సీత' సినిమాను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.


ఈ సినిమా కథను బెల్లంకొండ శ్రీనివాస్ కంటే ముందు తేజ వేరే హీరోలకి చెప్పాడట. కథ నచ్చిన హీరోలు ఈ సినిమా చేయడానికి మాత్రం ముందుకు రాలేదని లేటెస్ట్ అప్‌డేట్. అందుకు మేయిన్ రీజన్ 'సీత' అనే కథ మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతుందట. అందులోను ఈ కార్యెక్టర్ చేసేది కాజల్ అనగానే ఆ హీరోలందరు వెనక్కి వెళ్ళారట. అందుకు కారణం కాజల్ కి ఉన్న ఫేం అని చెబుతున్నారు. అయితే ఇవేవి పట్టించుకోకుండా బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా చేయడానికి అంగీకరించాడట. 


మరింత సమాచారం తెలుసుకోండి: