‘మహర్షి’ హడావిడి ముగిసిపోవడంతో మహేష్ వచ్చేనెల నుండి ప్రారంభం కాబోతున్న తన లేటెస్ట్ మూవీ గురించి అనీల్ రావిపూడితో ఈమధ్య చర్చలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈసినిమాకు సంబంధించి కీలక పాత్ర చేయడానికి అంగీకరించిన విజయ్ శాంతి కండిషన్స్ ఇంకా పూర్తిగా ఒక కొలిక్కి రావడం లేదు అన్న ప్రచారం జరుగుతోంది. 

ఈమూవీలో ఆమె తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ విషయంలో సీన్స్ విషయంలో మహేష్ తో సమానంగా ఆమె పాత్ర ఉండాలి అన్న డిమాండ్ ఆమె చేయడమే కాకుండా ఈమూవీకి సంబంధించి ఆమె 5 కోట్ల పారితోషికం డిమాండ్ చేస్తున్నట్లు ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. అయితే ఈ విషయాలలో ఆమెతో రాయబారాలు జరుగుతున్నా ఆమె ఆ రాయబారాలకు స్పందించడం లేదు అన్న వార్తను కూడ ఆ పత్రిక ప్రచురించింది. 

‘మహర్షి’ మిగిల్చిన చేదు అనుభవంతో మహేష్ తన లేటెస్ట్ మూవీ బడ్జెట్ ను కంట్రోల్ లో ఉంచమనీ మరీమరీ అనీల్ రావిపూడికి చెపుతున్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థుతులలో విజయశాంతి కండిషన్స్ కు తల ఒగ్గి ఆమెను ఎంపికచేయాలా లేదంటే ఇదే పాత్రకు రమ్య కృష్ణను ఎంపిక చేసి ఈమూవీ బడ్జేట్ కంట్రోల్ లో పెట్టె విషయంలో రకరకాల ఆలోచనలు చర్చలు జర్గుతున్నట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలోని పొగరుబోతు అత్త పాత్రకు విజయశాంతి అన్నివిదాల సరిపోతుంది అని అనీల్ రావిపూడి భావిస్తున్న నేపధ్యంలో మరొకసారి విజయశాంతితో చర్చలు జరపాలని ఈమూవీ నిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. ఈసినిమాను అత్యంత వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్న నేపధ్యంలో విజయశాంతి కన్ఫ్యూజన్ మరి కొన్ని రోజులలో తేలిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి..    



మరింత సమాచారం తెలుసుకోండి: