టాలీవుడ్ లోకి ‘ఈశ్వర్’సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు జాతీయ స్థాయి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.  ప్రస్తుతం ప్రభాస్ నటించే సినిమాలకు టాలీవుడ్ లోనే కాదు కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా బాగా డిమాండ్ పెరిగింది.   ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా సాహో. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్, శ్రద్దా కపూర్ జంటగా నటిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ మూవీకి దాదాపు 200 కోట్ల బడ్జెట్ లో నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

బాహుబలి2 తర్వాత ప్రభాస్ లాంగ్ గ్యాప్ తీసుకోవడంతో ఫ్యాన్స్ నిరుత్సాహంలో ఉన్నారు. అయితే సాహూ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు 15 న రిలీజ్ కి సిద్దంగా ఉందని వార్తలు వస్తున్నాయి. ఫ్యాన్స్ ని సంతోష పెట్టేందుకు ప్రభాస్ వెంట వెంటనే రెండు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.  ప్రభాస్ తదుపరి మూవీ రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది.ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డె నటిస్తుంది. 

 ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగును యూరప్ లో కొంతవరకూ చిత్రీకరించారు. ప్రభాస్ ఒక వైపున 'సాహో' సినిమా షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలోని సినిమాను కూడా కానిచ్చేస్తున్నాడు. 150 నుంచి 300 కోట్ల బడ్జెట్ లో ఈ సినిమా నిర్మితమవుతోంది.  యూవీ క్రియేషన్స్ వారు .. గోపీకృష్ణ మూవీస్ వారు కలిసి నిర్మిస్తోన్న ఈ సినిమాకి  'జాన్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్ నగర శివారులో ఈ సినిమా కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సెట్ కోసం నిర్మాతలు దాదాపు 30 కోట్ల రూపాయలు వెచ్చిస్తునట్లు సమాచారం.   1960 కాలం నాటి పరిస్థితుల్లో యూరప్ లో ఎక్కువభాగం ఈ సినిమా ఉంటుంది. ముందుగా ఫారెన్ లొకేషన్స్ లో షూటింగ్ చేద్దామని భావించారు. ఫారెన్ లోని వివిధ ప్రాంతాల్లో షూటింగ్ భారీ ఖర్చుతో కూడుకున్న పని. అందువల్ల హైదరాబాద్ లోనే అవసరమైన సెట్ నిర్మించుకుని అందులో షూటింగ్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. ప్రభాస్ సొంత నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లోనే ఈ చిత్రం తెరకెక్కుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: