1980-90 ప్రాంతాల మధ్య హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన భానుప్రియ తన అందమైన కళ్ళతో ఎలాంటి పాత్ర అయినా పోషించడంలో ఎంతో పేరును తెచ్చుకుంది. అలనాటి టాప్ హీరోలు చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణతో పాటు ఎందరో హీరోలతో ఆమె అనేక సినిమాలలో నటించింది.  

దర్శకుడు వంశీ దర్శకత్వం వహించిన ‘సితార’ సినిమాతో ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె ‘స్వర్ణకమలం’ సినిమాలో చేసిన అద్భుతమైన నటనకు అనేక అవార్డులు కూడ వచ్చాయి. అయితే అలాంటి భానుప్రియ కొత్త హీరోయిన్స్ హవా పెరిగి పోవడంతో మెల్లగా కనుమరుగైపోయి ప్రస్తుతం అప్పుడప్పుడు అమ్మ పాత్రలు చేస్తోంది.

ఇలాంటి పరిస్థుతులలో ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను సీనియర్ డైరెక్టర్ వంశీ పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన విషయాన్ని ఇప్పుడు ఆలస్యంగా బయటపెట్టింది. తాను వంశీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నప్పుడు తనను ప్రేమిస్తున్నానని అంతేకాకుండా తనను పెళ్ళి చేసుకుంటానని చాల ఒత్తిడి చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంది. 

అయితే అప్పటికే వంశీకి పెళ్ళి అయి పిల్లలు కూడ ఉన్న విషయం తనకు తెలిసి తాను అప్పట్లో వంశీ ప్రేమను తిరస్కరించిన విషయాన్ని భానుప్రియ గుర్తుకు చేసుకుంది. ఆతరువాత భానుప్రియ ప్రముఖ నృత్య కళాకారిణి సుమతీ కౌశల్ కొడుకుని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం భానుప్రియ భర్త ఆదర్శ కౌశల్ అమెరికాలో స్థిరపడ్డ బాగా పేరున్న ఫోటోగ్రాఫర్. అయితే భానుప్రియ ఇంత ఆలస్యంగా అప్పటి దర్శకుడు వంశీ తన పై చూపించిన ప్రేమను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవడం కొంత వరకు షాక్ ఇచ్చే విషయం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: