నాచురల్ స్టార్ నాని హీరోగా మళ్ళి రావా చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో శ్రద్ధ శ్రీనాధ్ హీరోయిన్ గా నటించిన సినిమా జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో మంచి ఎమోషనల్ జర్నీగా సాగిన ఈ సినిమాపై విడుదల రోజు నుండి అటు ప్రేక్షకులు ఇటు విమర్శకులు అని తేడా లేకుండా అందరి నుండి విపరీతమైన ప్రశంశలు లభించాయి. అయితే అప్పటికే నాగ చైతన్య మరియు సమంతల కలయికలో వచ్చిన మజిలీ సినిమా మంచి విజయాన్ని అందుకుని దూసుకెళ్తుండగా ఈ జెర్సీ సినిమా ఎంత మేర కలెక్షన్లు కొల్లగొటుదుందో అని అందరూ అనుకున్నారు. 


నిజానికి మొదటి రోజు నుండి సినిమాకు టాక్ సూపర్బ్ గా వచ్చినా, కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో అయితే రాలేదని కొందరు బయ్యర్లు ఖంగారు పడ్డారు. అయితే టాక్  రోజురోజుకి బాగా పాజిటివ్ గా రావడంతో కలెక్షన్లు కూడా మెల్లగా పుంజుకున్నాయి. ఇకపోతే ఆ తరువాత మహేష్ బాబు నటించిన మహర్షి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న నేపథ్యంలో జెర్సీ హవా చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో జెర్సీ చివరకు బ్రేక్ ఈవెన్ కి అయినా చేరుకుంటుందా అని అనుకున్న వారు కూడా లేకపోలేదు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ చివరకు క్లోసింగ్ సమయానికి ఈ సినిమా ఓవర్ ఆల్ గా రూ.34 కోట్ల మేర కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ విశ్లేషకులు చెపుతున్నారు. 


వాస్తవానికి ఈ సినిమాని నిర్మాతలు రూ.27 కోట్లకు అమ్మడం జరిగిందని, దీని ప్రకారం రూ.7 కోట్ల రూపాయలు నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. నిజానికి ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన జెర్సీ, మెల్లగా మంచి టాక్ తో తన కలెక్షన్ల ప్రభంజనాన్ని సృష్టించి ఇంతటి అద్భుత విజయాన్ని అందుకుందని, ఈ విజయానికి కారణం ప్రేక్షకులు మంచి సినిమాలను ఆదరించడమే అని ఆ చిత్ర యూనిట్ అభిప్రాయపడుతోంది. ఏది ఏమైనప్పటికీ ఈ అద్భుత విజయంతో నాని ఖాతాలో మరొక సూపర్ హిట్ పడినట్లే మరి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: