సామాన్యులకు సినీ సెలబ్రెటీలకు ఎక్కడైనా వ్యత్యాసం ఉంటుంది.  సెలబ్రెటీలు రెస్టారెంట్లకు వచ్చినా..ఏదైనా పెద్ద హోటళ్లకు వచ్చినా..లేదా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినా వారిని చూడటానికి జనాలు, ఫ్యాన్స్ ఎగబడుతుంటారు..వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటారు. అయితే అది వారి అభిమానం..ఆ సెలబ్రెటీకి ఉన్న గౌరవం.  కానీ ఈ మద్య కొంత మంది సెలబ్రెటీలకు కూడా బయట చిక్కులు వచ్చి పడుతున్నాయి..ఘోరమైన అవమానాలు ఎదురువుతున్నాయి.  తాజాగా ప్ర‌ముఖ సింగ‌ర్ శ్రేయా ఘోష‌ల్‌కి చేదు అనుభ‌వం ఎదురైంది.

సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్‌లో ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో త‌న వ‌ద్ద ఉన్న వాయిద్య ప‌రికరాన్ని విమానంలోకి అనుమ‌తించ‌లేదు.  దాంతో ఆ పరికరాలను ఆమె అక్కడే వదిలేసి వెళ్లారు.  గతంలో కూడా షారూఖ్ ఖాన్ మరికొంత మంది నటీ,నటులకు ఇలాంటి ఛేదు అనుభవాలే ఎదురయ్యాయి.  కాగా,  ఈ విషయంపై శ్రేయా సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్  ఘాటుగానే ట్విట్ చేశారు.  మ్యుజిషియ‌న్స్ వ‌ద్ద విలువైన ప‌రిక‌రాలు ఉంటే సింగ‌పూర్ ఎయిర్‌లైన్స్ సంస్థ విమానంలోకి ఎక్క‌నివ్వేదేమో.. ధ‌న్య‌వాదాలు నాకు మంచి గుణ‌పాఠం చెప్పారు అని శ్రేయా త‌న ట్వీట్‌లో తెలిపింది. 

దాంతో వెంటనే స్పందించిన ఎయిర్‌లైన్స్ సంస్థ..క్షమించండి శ్రేయా గారూ..అక్కడ ఏం జరిగిందో మాకు స్పష్టంగా తెలియదు..మా సిబ్బంది మీతో ఏమి అన్నారో విపులంగా వివ‌రించ‌గ‌లారా అని త‌మ ట్వీట్‌లో పేర్కొంది ఎయిర్ లైన్స్ సంస్థ‌. 



మరింత సమాచారం తెలుసుకోండి: