సినీ ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపేసిన సంఘటన. దర్శకులు, నటులు, కమెడియన్స్ ఇలా ఇండస్ట్రీలో చాలామందికి ఈ సంఘటన చేదు అనుభవాన్ని మిగిల్చింది. నిజా నిజాలతో సంబంధం లేకుండా టీవీ ఛానళ్ళు కూడా టీ.ఆర్.పి కోసం రోజుల తరబడి తెగ హడావుడి చేసి చాలా మందిని బ్యాడ్ చేశాయి. ప్రస్తుతం ఈ విషయంలో అందరికి ఊరట కలిగినట్టు తెలుస్తోంది.


హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన ఛార్మి ప్రస్తుతం పూరి బ్యానర్ లో నిర్మాణం జరుపుకుంటున్న సినిమాల నిర్మాణ బాధ్యతలు చూసుకుంటుంది. తాజాగా ఛార్మి పుట్టిన రోజు సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఆ సందర్బంగా గతంలో తాను ఎదుర్కొన్న సంఘటనల గురించి చెప్పింది. టాలీవుడ్ ను షేక్ చేసిన డ్రగ్స్ కేసు లో తన పేరు రావడంపై మొదటి సారి ఛార్మి స్పందించింది. ఆ కేసు తన జీవితంలోనే నీచమైన సంఘటన అని చెప్పింది.


ఛార్మి డ్రగ్స్ కేసులో నా పేరు ఎలా వచ్చిందో తెలియదు.. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డాను. నేను మాత్రమే కాదు నా కుటుంబ సభ్యులు కూడా చాలా బాధ పడ్డారు. అయితే నేను ఏ తప్పు చేయలేదు.  తప్పకుండా నాకు క్లీన్ చీట్ వస్తుందని ఛార్మి చెప్పింది.  ఇక సినిమాల గురించి ఛార్మి స్పందిస్తూ నటిగా 15 ఏళ్లు చేసి బోర్ కొట్టింది మళ్లీ నటిగా చేయాలనే కోరిక లేదు ఇకపై నిర్మాతగా కొనసాగుతానంటూ చెప్పింది.



మరింత సమాచారం తెలుసుకోండి: