దర్శకుడిగా ఎస్‌జే సూర్య ఎంత ఫేమసో యాక్టర్ గా కూడా అంతే పాపులర్ అయ్యారు...ఇంకా చెప్పాలంటే హీరోగా, విలన్ గా ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఇక తన సినిమాలలో రొమాంటిక్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందుకే కొంతమంది హీరోయిన్స్ సూర్య పక్కన నటించాలంటే ఎంతో ఆలోచిస్తారు.


ఇక అలాంటి కామెంటే చేస్తోంది మరో హీరోయిన్. సూర్య  సరసన జోడీగా నటించేందుకు మొదట భయపడ్డానని నటి ప్రియ భవాని శంకర్‌ తెలిపింది. ఎస్‌జే సూర్య, ప్రియ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘మాన్‌ స్టర్‌’.ఈ సినిమా రీసెంట్‌గా రిలీజైంది. ఈ సందర్భంగా హీరోయిన్ ప్రియ మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే ఈ సినిమా దర్శకుడు.. హీరోగా ఎస్‌జే సూర్యను అనుకుంటున్నామని చెప్పారట. దాంతో ఆలోచనలో పడిందట. బాగా ఆలోచించుకొని ఏ విషయం చెప్పమని వెళ్ళిపోయారట. అయితే కథ మొత్తం కామెడీ ట్రాక్‌ ఎక్కువ కాబట్టి రొమాన్స్‌ సన్నివేశాలు పెద్దగా ఉండవు అనుకుని ఓకే చెప్పిందట.


ఎందుకంటే ఎస్‌జే సూర్య నటించిన సినిమాల్లో రొమాన్స్‌, హాట్‌ సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ఆయనతో నటించాలనగానే కొంచెం భయమేసిందట. అయితే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం చాలా కంఫర్టబుల్ గా అనిపించిందట. సూర్య చాలా మంచి మనిషి, నాకు మంచి ఫ్రెండ్‌ అయ్యారు. మొట్టమొదటిసారిగా ఆయన నటించిన చిత్రానికి సెన్సార్‌ నుంచి యూ సర్టిఫికేట్‌ వచ్చిందంటే చూడండి. సో పిల్లలు, పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. అదే ఎస్‌జే సూర్యతో మరో అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉందని ప్రియ భవాని శంకర్‌ తెలిపింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: