యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఒకేసారి రెండు క్రేజీ సినిమాల్లో న‌టిస్తూ టాలీవుడ్లోనే కాకుండా నేష‌న‌ల్ వైడ్‌గా హాట్ టాపిక్‌గా మారాడు. బాహుబ‌లి సీరిస్ సినిమాలతో ప్ర‌భాస్ ఒక్క‌సారిగా నేష‌న‌ల్ హీరోగా మారిపోవ‌డంతో ఇప్పుడు ప్ర‌భాస్ సినిమాపై అంతే క్రేజ్ ఉంది. ఇక ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న సాహో, జాన్ (వ‌ర్కింగ్ టైటిల్‌) రెండు సినిమాల‌ను తెలుగు, త‌మిళ్‌, మాళ‌యాళంతో పాటు హిందీ.. కొన్ని భార‌తీయ భాష‌ల్లోనూ రిలీజ్ చేస్తున్నారు.


ఇక సాహో హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌. ఈ సినిమా ఆగ‌స్టు 15న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక జిల్ రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో వస్తోన్న జాన్ సినిమాపై సైతం భారీ అంచ‌నాలు ఉన్నాయి. జాన్ ఒక‌ రొమాంటిక్ లవ్ స్టోరీ. 1970 కాలంలో సాగే ఉద్విగ్నభరితమైన ప్రేమకథా సినిమాగా ఉంటుంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ సినిమాకు సైతం భారీ బ‌డ్జెట్ పెడుతున్నారు.


గోపీకృష్ణా మూవీస్ బ్యాన‌ర్‌, యూవీ క్రియేష‌న్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో కీల‌క స‌న్నివేశాలు యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించాల్సి ఉంది. అయితే ప‌లువురు తారాగణాన్ని అక్క‌డ‌కు త‌ర‌లించాల్సి ఉండ‌డం క‌ష్టంగా ఉండ‌డంతో హైద‌రాబాద్ శివార్ల‌లో జాన్ కోసం యూర‌ప్ వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పించేలా రూ.30 కోట్ల‌తో భారీ సెట్ వేశారు.


యూర‌ప్ వాతావ‌ర‌ణం ప్ర‌తిబింబించేందుకే సెట్‌కే ఏకంగా రూ.30 కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారంటే సినిమా టోట‌ల్ బ‌డ్జెట్ చాలా ఎక్కువ‌గానే ఉండ‌నుంది. పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. 2020 సమ్మర్ కానుకగా సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ రెండు సినిమాల‌తో ప్ర‌భాస్ రేంజ్ పూర్తిగా మారిపోనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: