మెగా కాంపౌండ్ నుండి వెండితెరకు పరిచయమైన అల్లు బ్రదర్స్ వారిలో ఒకరు అల్లు శిరీష్ ఇప్పటివరకు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్టు కొట్టి ఖాతా తెరవలేదు. అయినా కానీ అల్లు శిరీష్ ఎలాగైనా హిట్టు కొట్టి మెగా అభిమానులను అలరించడానికి తన వంతుగా తీవ్ర కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అల్లు శిరీష్ రీమేక్ నమ్ముకున్నారు. ‘ఏబీసీడీ’ అనే సినిమా నటించడం జరిగింది. తాజాగా విడుదలైన ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు శిరీష్ కి  సినిమాకి సినిమాకి మధ్య అంతా ఎందుకు లాంగ్ గ్యాప్ తీసుకుంటున్నారన ప్రశ్న ఎదురైంది.


అయితే ఈ ప్రశ్నకు అల్లు శిరీష్ ఇచ్చిన సమాధానం అందరికి షాక్ ఇచ్చింది. ఈ తప్పు నాది కాదు. కావాల్సినన్ని కాల్షీట్లు ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉంటే మేకర్స్ వాటిని సరిగా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అనే అర్థంలోనే ఆన్సర్ ఇచ్చారు శిరీష్. కేవలం సినిమాలు తీసే దర్శకనిర్మాతల వల్లనే ఈ ఆలస్యం అని అన్నారు. దీంతో అల్లు శిరీష్ చేసిన కామెంట్ ఇండస్ట్రీలో పెద్ద వివాదాస్పదమైన ట్లు సమాచారం.


నిజంగా ఆన్లైన్ లొకేషన్ లో డైరెక్టర్ చెప్పినట్టు హీరో వినగలిగితే కచ్చితంగా సినిమాలు టైం కి రావడం ఖాయమని..డైరెక్టర్ చెప్పినట్టు కాకుండా స్క్రిప్ట్ లో వేలు పెట్టి హిట్టు కావాలని స్టోరీ లో వేలు పెడితే సినిమాలు ఆలస్యం అవుతాయి అలాగే లాంగ్ గ్యాప్ కూడా వస్తాయి అని అల్లు శిరీష్ చేసిన కామెంట్లపై ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది డైరెక్టర్లు కామెంట్ చేశారట. అంతే కాకుండా ఇంకా చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లు అల్లు శిరీష్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు అని మండిపడుతున్నారట. దీంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న పరిణామాలు చూస్తుంటే అల్లు వారి అబ్బాయి చుట్టూ వివాదం పెద్దగా అయ్యేటట్లు ఉంది అని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: