నందమూరి వారసులు బాలయ్య అటు అబ్బాయి ఎన్టీఆర్ కు అప్పట్లో కొన్ని రోజులు మాటలు లేవన్న సంగతి బహిరంగ రహస్యం. అయితే హరికృష్ణ మరణం తరువాత కలిసిపోయారని చెప్పాలి. ఇప్పుడు ఉన్నట్లుండి బాబాయి-అబ్బాయి అభిమానుల మధ్య సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో వార్ నడుస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అని ఉత్కంఠ రేగుతున్న సమయంలో బాలయ్య, జూనియర్ అభిమానులు ట్విట్టర్లో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగుతున్నారు.


తెలుగుదేశం పార్టీ గెలవని పక్షంలో బాలయ్య కానీ, లోకేష్ కానీ పార్టీని నిలబెట్టలేరని.. ఎన్టీఆర్ మాత్రమే పార్టీని కాపాడగలరని అతడి అభిమానులు ట్వీట్లు వేయడంతో మొదలైంది రగడ. ఎన్టీఆర్ ఒకసారి ప్రచారం చేస్తే పార్టీ దెబ్బ తిందని, ఆ తర్వాత అతను పార్టీకి ఏమీ చేయలేదని.. బాలయ్య సాయం తీసుకుని, ఆ తర్వాత ఆయన్ని గౌరవించలేదని.. తారక్‌కు టీడీపీలో స్థానమే లేదని బాలయ్య ఫ్యాన్స్ అతడిని విమర్శించడం మొదలుపెట్టారు.


ఇరు వర్గాలూ ఎవరి వాదన వాళ్లు వినిపిస్తూ అవతలి వాళ్లను కించపరుస్తూ పెద్ద ఎత్తునే ట్వీట్ యుద్ధం చేస్తున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఎన్నికల ఫలితాలు వచ్చి, తెలుగుదేశం నిజంగానే ఓడిపోత పరిస్థితి ఎలా ఉంటుందో మరి? దీనితో తమ అభిమాన హీరోలు కలిసిపోయిన ఇలా సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఇలా తిట్టుకోవటం తమ హీరోలకు కూడా నచ్చదని చెప్పాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: