మోస్ట్ టాలెంట్ ఉన్న టాలీవుడ్ దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు.  కెరీర్ మొదట్లో సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చాడు.  ప్రేమకథలతో పాటు సామజిక అంశాలు ఉండే కథలను కూడా చక్కగా చూపించారు.  అయితే, రీసెంట్ గా కృష్ణవంశి చేస్తున్న సినిమాలు వర్మ సినిమాలను తలపిస్తున్నాయి.  వరసగా ఫెయిల్ అవుతున్నాయి.  ప్రస్తుతం ఈ దర్శకుడు వందేమాతరం అనే సినిమా చేస్తున్నాడు.  


టాలీవుడ్ లోని టాప్ హీరోలతో సినిమాలు చేసిన కృష్ణవంశి... నాగార్జునతో నిన్నే పెళ్లాడుతా తరువాత ఆయనతో అలాంటి సినిమా చేయలేకపోయారు.  వర్మ వరసగా బయోపిక్ లు చేస్తూ విజయాలు సాధిస్తుంటే.. ఆ తరహాలోనే వంశి కూడా బయోపిక్ చేయాలని అనుకోని నాగార్జునను కలిస్తే... అందుకు నాగార్జున ఒప్పుకోలేదని సమాచారం.  ఏఎన్నార్ బయోపిక్ చేసే సమస్య లేదని చెప్పేశారట.  ఈ విషయంలో నాగార్జునే చేస్తారో లేదో చెప్పాలని కృష్ణ వంశి అంటున్నాడు.  


కృష్ణవంశి... బాలకృష్ణ కాంబినేషన్లో సినిమా రాలేదు.  వంశి హవా నడుస్తున్న రోజుల్లో ఈ కాంబినేషన్లో సినిమా ఆశించినా ప్రయోజనం లేకపోయింది.  కొంతకాలం క్రితం బాలకృష్ణతో వంశి రైతు అనే సినిమా ప్లాన్ చేశారు.  పూర్తి స్థాయిలో రైతుల గురించిన సినిమా.  సినిమా ప్రారంభం కూడా జరిగింది.  కానీ, అమితాబ్ ఇందులో నటించేందుకు అంగీకరించకపోవడంతో సినిమాను పక్కన పెట్టాడు బాలకృష్ణ.  


రైతు సినిమాను భారీ ఎత్తున తీయాలని కృష్ణవంశీ ప్లాన్ చేశాడు.  కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు.  ఈ విషయం గురించి కృష్ణవంశీని అడిగితె... తనకు ఆ సినిమా కథ ఎంతగానో నచ్చిందని... బాలకృష్ణ ఓకే అంటే ఇప్పటికైనా తాను రెడీగా ఉన్నానని అంటున్నాడు వంశి.  మరి బాలయ్యబాబు ఒప్పుకుంటాడా. 


మరింత సమాచారం తెలుసుకోండి: