మహర్షి హిట్ తో మంచి జోష్ లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ తన 26వ సినిమా అనీల్ రావిపుడితో చేస్తాడని తెలిసిందే. జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతుందని తెలుస్తుంది. సీమ బిడ్డగా సూపర్ స్టార్ మహేష్ కనిపిస్తాడట. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో కథ రాసుకున్నా సినిమాలో కామెడీ కూడా అదిరిపోతుందని అంటున్నారు.


ఇక ఈ సినిమాకు టైటిల్ గా రెడ్డి గారి అబ్బాయి అని పెట్టబోతున్నారట. అనీల్ రావిపుడి తన సినిమాలకు ముందు టైటిల్ ఎనౌన్స్ చేసి సినిమా మొదలు పెడతాడు అందుకే మహేష్ సినిమాకు ఆ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ఆల్రెడీ ఫిల్మ్ చాంబర్ లో రిజిస్టర్ చేయించారట.


నిన్నమొన్నటి దాకా వేరే టైటిల్ ప్రచారంలో ఉండగా ఇప్పుడు ఈ కొత్త టైటిల్ ఫ్యాన్స్ ను అలరిస్తుంది. సినిమాలో మహేష్ పవర్ ఫుల్ గా కనిపిస్తారట. రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. మహర్షి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న మహేష్ కొద్దిరోజులు ఫ్యామిలీతో జాలీ ట్రిప్ వేసే ప్లాన్ లో ఉన్నాడు.


పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస సక్సెస్ లను అందుకున్న అనీల్ రావిపుడి మహేష్ తో ఛాన్స్ పట్టేయడం లక్కీ అని చెప్పాలి. అనీల్ రావిపుడి సినిమా అనుకున్న విధంగా పూర్తి చేసి 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేయాలని చూస్తున్నారు. సో ఈసారి సంక్రాంతి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పండుగ మరింత స్పెషల్ కానుందన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: