టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్ తెలుగు తెరపై హిరోగా పరిచయమయ్యాడు. చిన్నతనంలోనే సిసింద్రీ సినిమాలో అందరని ఆకట్టుకున్నాడు. సిసింద్రీ చిత్రంలో అల్లారి పిల్లాడిలా వ్యవహిరించిన తీరు అందర్ని ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా అదే అల్లారిని కొనసాగిస్తూ సినిమాలు చేస్తున్నాడు.


2014లో అక్కినేని కుటుంబ సభ్యులతో వివిధ తరాలవారితో విక్రం కుమార్ దర్శకత్వంలోని మనం చిత్రంలో చివరి సన్నివేశంలో కనిపించి కనువిందు చేశాడు. మంచి ఫలితాలు సాధించిన ఇది ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్ పురస్కారంతో పాటు అనేక పురస్కారాలను పొందింది. కథానాయకుడిగా మొదటి సినిమా కోసం అనేక కథలను అనేక దర్శకుల నుండి కథలు విని చివరకు వి. వి. వినాయక్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించాడు. సంవత్సరం పాట వ్యక్తిగతంగా, శారీరకంగా బలంగా ఉండటానికి థాయిలాండ్ లో రెండు నెలల పాటు శిక్షణ తీసుకుని అఖిల్ అనే చిత్రంలో నటించాడు.


హలో సినిమాలో అఖిల్ కొంత పాజిటివ్ టాక్ ను క్రియేట్ చేసుకున్నా... ఈ యేడాది విడుదలైన మిస్టర్ మజ్ను అనుకున్నంత వసూళ్లను సాధించలేకపోయింది. ఇప్పుడు అఖిల్ నాలుగో సినిమాకు స‌ర్వం సిద్ధ‌మైంది. గీతాఆర్ట్స్ 2 బ్యాన‌ర్‌పై బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. అంతా రెడీ అయినా హీరోయిన్ విష‌యంలోనే నిర్మాత‌ల‌కు ఏ క్లారిటీ రావ‌డం లేదు.


కియరా అద్వాని, ర‌ష్మిక మంద‌న్నా పేర్లు వినిపించినా.. వారి బిజీ షెడ్యూల్స్‌తో డేట్స్ అడ్జ‌స్ట్ చేయ‌లేక‌పోయారు. దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇత‌ర హీరోయిన్స్‌ను కూడా ప‌రిశీలించారు. కానీ ఏ ఒక్క‌రూ ఫైన‌లైజ్ కాలేదు. లేటెస్ట్‌ స‌మాచారం ప్ర‌కారం హీరోయిన్ లేకుండా షూటింగ్‌ను స్టార్టింగ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ నెల 24న సినిమా లాంఛ‌నంగా ప్రారంభం అవుతుంది. తొలి షెడ్యూల్‌ను అఖిల్‌తోనే చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఈ షెడ్యూల్ పూర్త‌య్యే లోపు హీరోయిన్‌ను ఖ‌రారు చేద్దామ‌ని భావిస్తున్నార‌ట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: