టాలీవుడ్లో పూజా హెగ్డే న‌టించిన సినిమాలేవి బ్లాక్‌బ‌స్ట‌ర్ కాలేదు. ఆమె తెలుగుతో పాటు హిందీలో న‌టించిన సినిమాలు అన్ని ప్లాప్, యావ‌రేజ్‌తోనే స‌రిపెట్టేశాయి. జీవాతో కోలీవుడ్‌లో మాస్క్‌, తెలుగులో ముకుంద, ఒక లైలా కోసం, డీజే ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ప్లాప్ అయ్యాయి. ఎన్టీఆర్‌తో చేసిన ఒక్క అర‌వింద స‌మేత మాత్ర‌మే యావ‌రేజ్ మార్కులు వేయించుకుంది. ఇక తాజాగా వ‌చ్చిన మ‌హ‌ర్షికి క‌లెక్షన్లు బాగున్నా టాక్ ఏమంత గొప్ప‌గా లేదు.


పూజా హెగ్డేతో రొమాన్స్ చేసేందుకు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎంతో ఇష్టంగా ఉన్నా ఆమె సెంటిమెంట్ మాత్రం వారిని భ‌య‌పెట్టేస్తోంది. తాజాగా పూజా యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప‌క్కన జాన్ సినిమాలో న‌టిస్తోంది. జిల్ ఫేం రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే ఈ సినిమా కోసం ఇటీవ‌ల హైద‌రాబాద్ స‌మీప ప్రాంతాల్లో రూ.30 కోట్ల‌తో ఓ భారీ సెట్ వేశారు. యూర‌ప్ వాతావ‌ర‌ణాన్ని ప్ర‌తిబింబిచేలా ఈ సెట్ ఏర్పాట్లు చేస్తున్నారు.


ఇక ఈ సినిమా సాహో త‌ర్వాత ప్ర‌భాస్ కెరీర్‌లో మ‌రో బిగ్గెస్ట్ చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఇప్పుడు ప్ర‌భాస్‌తో పాటు ఆయ‌న ఫ్యాన్స్‌కు పూజా ఐరెన్‌లెగ్ సెంటిమెంట్ టెన్ష‌న్ విపరీతంగా ఉంద‌ట‌. పూజా హెగ్డే ఇప్పటివరకు మహేష్ బాబు , జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ సినిమాల్లో న‌టించ‌గా... అవి హిట్ అవ్వ‌లేదు. ఇప్పుడు జాన్ సినిమా రిజ‌ల్ట్ తేడా వ‌స్తే అంద‌రూ నిండా మునిగిపోతారు. మ‌రి పూజ ప్ర‌భాస్‌ను ముంచుతుందో ?  లేదా ?  తేల్చుతుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: