బాహుబలి సినిమా క్రియేట్ చేసిన రికార్డుల తరువాత ప్రభాస్ గురించి బాలీవుడ్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. అయితే  కబీర్ సింగ్ టీజర్ రిలీజైన తర్వాత కావాలనే ఈ సినిమా టీమ్ ప్రభాస్ రియాక్షన్ ని హైలెట్ చేసింది. తాజాగా ఇప్పుడు షాహిద్ కపూర్ కూడా ప్రత్యేకంగా ప్రభాస్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ప్రభాస్ కి టీజర్ బాగా నచ్చిందని తెలిసి సంబరపడ్డానని, కబీర్ సింగ్ అర్జున్ రెడ్డి సినిమాకు కాపీ-పేస్ట్ లా లేదని ప్రభాస్ చెప్పడం సంతోషంగా ఉందని, ప్రభాస్ లాంటి హీరో నుంచి ప్రశంసలు రావడంతో తన సంతోషానికి హద్దుల్లేవని చెప్పుకొచ్చాడు. 


వాస్తవానికి.. ప్రభాస్-షాహిద్ ఇద్దరూ ఏడాది గ్యాప్ తో తెరపైకి వచ్చారు. ప్రభాస్ 20 సినిమాలకి చేరువవుతుండగా.. షాహిద్ 30 దాటేశాడు. అప్పట్లో కత్తిలాంటి హీరోయిన్స్ తో రొమాన్స్, యూత్ లో మంచి ఫాలోయింగ్.. షాహిద్ క్రేజే వేరుగా ఉండేది. అలాంటి షాహిద్ ఇప్పుడు సినిమా ట్రైలర్ తనకు నచ్చిందని ప్రభాస్ చెప్పడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ప్రభాస్ కి నా సినిమా ట్రైలర్ నచ్చిందొహో అంటూ టముకేసుకుంటున్నాడు. 


ఒక్క షాహిద్ కపూరే కాదు, చాలామంది బాలీవుడ్ హీరోలు ప్రభాస్ తో స్నేహానికి తపించిపోతున్నారు. బాక్సాఫీస్ పై ప్రభాస్ డామినేషన్ ని ఒప్పేసుకుంటున్నారు. పనిలో పనిగా బాహుబలి స్టార్ ని తమ సినిమా ప్రమోషన్లకు బాగానే వాడేసుకుంటున్నారు. హిందీ మీడియా కూడా ప్రభాస్ కు మంచి ప్రాముఖ్యతనిస్తోంది. సాహోతో మరో సాలిడ్ హిట్ పడితే.. ప్రభాస్ దక్షిణాదిలో ఉంటూనే బాలీవుడ్ ని ఏలేయడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: