టాలీవుడ్ లో తన అందచందాలతో కుర్ర హీరోల మనసు దోచి వరుస సినిమాలతో నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది బాలీవుడ్ బ్యూటీ రకూల్ ప్రీత్ సింగ్. ఆ మద్య టాప్ కుర్ర హీరోలందరూ తమ పక్కన రకూల్ ఉంటే సరైన జోడీ గా ఉంటుందని దర్శక, నిర్మాతలకు చెప్పేవారని టాక్ వినిపించింది. రకూల్ నటించిన సినిమాలు హిట్టు, ఫ్లాపు అనే తేడా లేకుండా స్టార్ హీరోలందరూ ఈ బాలీవుడ్ బ్యూటీకి ఫిదా అయ్యేవారు.
రకూల్ హీరోయిన్ గా నే కాకుండా వ్యాపార రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ఆ మద్య తెలుగు లో కాస్త సినిమాలు తగ్గడంతో కోలీవుడ్ పై కన్నేసింది. ప్రస్తుతం అక్కడ కూడా పెద్దగా సినిమాలు లేకపోవడంతో బాలీవుడ్ లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘దే దే ప్యార్దే’సినిమా చేసింది. అకీవ్ అలి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. సినిమాకు హిట్ టాక్ వచ్చి రకుల్ కు కాస్త రిలీఫ్ ఇచ్చింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే..ఆశిష్ మెహ్రా (అజయ్ దేవగణ్) తన భార్య మంజు (టబు)తో 18 ఏళ్ల క్రితమే విడిపోయి వేరుగా ఉంటాడు. అతనికి వయసొచ్చిన కూతురు, కొడుకు ఉంటారు. ఇదే సమయంలో తన కూతురు వయసు ఉన్న ఆయేషా (రకూల్ ) పరిచయం ఏర్పడుతుంది. 2017లో విడుదలైన గోల్మాల్ ఎగైన్ మూవీ నేపథ్యంలోనే దేదే ప్యార్ దే సినిమా ఉందంటున్నారు అభిమానులు.