టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ‘రాజకుమారుడు’సినిమాతో హీరోగా పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు ఇప్పుడు టాలీవుడ్ లో నెంబర్ వన్ రేస్ లో ఉన్నారు.  గత ఏడాది భరత్ అనే నేను తో బ్లాక్ బస్టర్ సాధించారు.  ఈ ఏడాది వంశి పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ‘మహర్షి’సినిమాతో మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు మహేష్ బాబు.  సాధారణంగా మహేష్ బాబు ఏ సినిమా హిట్ అయినా..ఫ్లాప్ అయినా తన కుటుంబంతో విదేశాలకు విహార యాత్రలకు వెళ్తుంటారు. 

మహేశ్ బాబు తన కెరీర్ లో నటించిన 25వ సినిమా మహర్షి.. అనుకున్న దానికన్నా ఎక్కువే రెస్పాన్స్ రావడం..కలెక్షన్లు రావడం జరుగుతుంది.  మహర్షి అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వస్తోంది. బాక్సాఫీసు వద్ద కూడా మహర్షి కాసుల వర్షం కురిపిస్తోంది. మహేశ్ బాబు కెరీర్ లో ఫస్ట్ వీక్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.  అయితే తన కుటుంబ సభ్యులతో ఈ సినిమా ఎలా ఉందనే విషయంపై మహేష్ బాబు కొన్ని ఖంగుతినే విషయాలు తెలుసుకున్నాడట. 

మహర్షి మూవీతో తన పిల్లలు సితార, గౌతమ్ ఎంతో కనెక్టయ్యారని చెప్పారు. ముఖ్యంగా సితార మహర్షి సినిమా చూసి ఏడ్చేసిందని, అంటే అందులో ఉన్న సెంటిమెంట్, ఎమోషన్స్ తనపై అంతగా ప్రభావం చూపాయా.. తను ఎదిగిపోయిందన్న విషయం, తనకు అన్నీ తెలుస్తున్నాయన్న విషయం ఆ సంఘటనతో అర్థమైందని అన్నారు మహేష్ బాబు. ఇక  గౌతమ్ అభినందన పూర్వకంగా హైఫై ఇచ్చాడని, పిల్లల సంతోషం చూసిన తర్వాత తాను కూడా ఆనందంగా ఫీలయ్యానని మహేశ్ తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: