క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచుస్తున్నారు. అసలైతే బాలయ్య 100వ సినిమాకి డైరెక్టర్ కృష్ణవంశీ అని చాలా గట్టిగా ఇండస్ట్రీలో వినపడింది. ఈ కాంబినేషన్ లో 100వ సినిమా అంటే ఇక అటు డైరెక్టర్ కి ఇటు హీరోకి తమ ఫిల్మోగ్రఫీ లో ఒక స్పెషల్ మూవీగా ఉండిపోతుందని కూడా అందరూ అనుకున్నారు. బాలయ్య 100 వ సినిమా కూడా ఇదే అని దాదాపు ఫిక్సై..సెట్స్ మీదకు కూడా వెల్లబోయో సమయానికి బాలయ్య మనసు మార్చుకున్నాడు. అంతే ఇక ఈ సినిమా అటకెక్కింది.


తన 100వ సినిమాగా గౌతమీ పుత్ర శాతకర్ణి లైన్ లోకి వచ్చింది. ఈ సినిమాతో క్రిష్ బాలయ్యకు చరిత్రలో చెప్పుకునే హిట్టిచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ బాలయ్య, కృష్ణవంశీ కాంబినేషన్ లో 101 వ సినిమా సినిమా ఉండబోతుందని ఆ సినిమానే 'రైతు' అని కూడా జోరుగా ప్రచారం జరిగింది. కానీ బాలయ్య వరుసగా పైసా వసూల్, జై సింహ, ఎన్.టి.ఆర్ బయోపిక్స్ తీసేశాడు. ఇప్పుడు కె.ఎస్.రవికుమార్ తో మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు. 


అయితే శాతకర్ణి తర్వాత బాలయ్యకు సరైన హిట్ పడలేదు. అందుకే క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ.. బాలయ్య గనక డేట్స్ ఇస్తే ఆయనతో రైతు సినిమా తీసి బ్లాక్ బస్టర్ హిట్టిస్తానని చెబుతున్నారు. కానీ ఈ సినిమా పట్టాలెక్కాలంటే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 'రైతు' లో ఓ ముఖ్య పాత్ర పోషించడానికి ఒప్పుకోవాలి. అయితే అది జరగకనే ఇంతక ముందు ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. మరి ఈసారైనా బాలయ్య హిట్ కోసం అమితాబ్ ని ఒప్పిస్తారో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: