మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం కాబోతున్న వైష్ణవ్ తేజ్ మూవీకి సంబంధించిన పనులన్నీ చక చకా జరిగిపోతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయమై క్లారిటీ వచ్చేసింది. మంగళూరుకు చెందిన క్రితి శెట్టి ని ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన క్రితి శెట్టి సౌత్ లో మెప్పించింది. తెలుగులో మెగా ఫ్యాలీ ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇస్తోంది. 


ఇక ఈ సినిమాకు 'ఉప్పెన' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా లేటెస్త్ అప్డేట్. అంతేకాదు తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నాడు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండటంతో  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. 


వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్న ఈ సినిమాతోనే టాలీవుడ్ కు క్రితి శెట్టి కూడా పరిచయం అవ్వబోతుంది. మే 25న ఈ సినిమాను ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ హీరోగా స్టార్ డం ను సంపాదించుకున్నాడు. ఇప్పుడు తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం కాబోతున్నాడు.   
  



మరింత సమాచారం తెలుసుకోండి: